యాప్నగరం

జాతీయగీతం వస్తుండగా నిలబడలేదని దాడి

మన దేశ జాతీయగీతం వినిపిస్తే ఎక్కడున్నా కూడా లేచి నిల్చోవాలన్నది కఠిన నియమం.

TNN 23 Jan 2017, 7:37 pm
మన దేశ జాతీయగీతం వినిపిస్తే ఎక్కడున్నా కూడా లేచి నిల్చోవాలన్నది కఠిన నియమం. కాగా ఈ మధ్య సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వేయాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా పలు చోట్ల థియేటర్లలో జనగణమన వేసినప్పుడు నిల్చోలేనదే కారణంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ వృద్ధుడిపై దాడి జరింది.
Samayam Telugu man assaulted for not standing during national anthem tune in film
జాతీయగీతం వస్తుండగా నిలబడలేదని దాడి


ముంబైలోని గురెగావ్ లోని ఓ థియేటర్లో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా ఆడుతోంది. దానికి అమల్ పీటర్ దాసన్ (59) అనే ఒక వృద్ధుడు కూడా వచ్చాడు. సినిమా మధ్యలో సన్నివేశానికి తగ్గట్టు డైరెక్టర్ జనగణమన పాటను వాడుకున్నాడు. ఆ పాట వస్తున్నప్పుడు కూడా థియేటర్లో అందరూ నిల్చున్నారు. కానీ అమల్ నిల్చోలేదు. దీంతో కోపం పట్టలేక పోయిన శిరీష్ మధుకర్ అనే యువకుడు అమల్ చెంప ఛెళ్లుమనిపించాడు. చుట్టూ ఉన్న ఇతర ప్రేక్షకులు జాతీయ గీతం వస్తున్నప్పుడు నిల్చోవాలని అమల్ కు చెప్పాల్సింది పోయి అతనికి మద్దతుగా నిలిచారు. శిరీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.