కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ పార్టీ ఆఫీస్ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు తెలుస్తోంది. చెన్నై శివారు ప్రాంతమైన పనైయూర్లోని విజయ్కు సంబంధించిన పార్టీ ఆఫీసులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా..
దళపతి విజయ్ అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే పార్టీని స్థాపించారు. వాళ్లే సొంతంగా కార్యకలపాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పనైయూర్లో ఆ పార్టీ భవనం ఉంది. ప్రస్తుతం అక్కడ పార్టీ బిల్డింగ్ను ఆధునికీకరిస్తుండగా.. ప్రభాకరన్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన ప్రభాకరన్.. గురువారం రాత్రి తాను పనిచేస్తున్న భవనం వద్దకు వచ్చాడు.
మద్యం సేవించి.. సూపర్ వైజర్ వద్దకు వెళ్లి తనకు పరోటా తినాలని ఉందని చెప్పాడు. తనకు రూ.100 డబ్బులు కావాలని అడిగాడు. అయితే ఆ తర్వత ఏమైందో ఏమో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం ప్రభాకరన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కనిపించాడు. అతని చేతిలో, నోట్లో పరోటా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
దళపతి విజయ్ అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే పార్టీని స్థాపించారు. వాళ్లే సొంతంగా కార్యకలపాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పనైయూర్లో ఆ పార్టీ భవనం ఉంది. ప్రస్తుతం అక్కడ పార్టీ బిల్డింగ్ను ఆధునికీకరిస్తుండగా.. ప్రభాకరన్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన ప్రభాకరన్.. గురువారం రాత్రి తాను పనిచేస్తున్న భవనం వద్దకు వచ్చాడు.
మద్యం సేవించి.. సూపర్ వైజర్ వద్దకు వెళ్లి తనకు పరోటా తినాలని ఉందని చెప్పాడు. తనకు రూ.100 డబ్బులు కావాలని అడిగాడు. అయితే ఆ తర్వత ఏమైందో ఏమో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం ప్రభాకరన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కనిపించాడు. అతని చేతిలో, నోట్లో పరోటా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.