యాప్నగరం

సందీప్ కిషన్ ‘మనసుకి నచ్చింది’ వాయిదా

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మనసుకి నచ్చింది’.

TNN 21 Jan 2018, 3:04 pm
సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మనసుకి నచ్చింది’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తొలుత జనవరి 26వ తేదీన విడుదల చేయాలనుకున్నా.. అనుకోని కారణాల వల్ల ఫిబ్రవరి 16కు వాయిదా వేసినట్లు నిర్మాతలు తెలిపారు.
Samayam Telugu manasuku nachindi has completed the censor formalities and will be releasing on feb 16
సందీప్ కిషన్ ‘మనసుకి నచ్చింది’ వాయిదా


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘మనసుకి నచ్చింది’ తెరకెక్కింది. రాధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూశామనే భావన కలిగించే చిత్రం ‘మనసుకు నచ్చింది’’ అని అన్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు మాటలు అందించిన సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.