గుజరాత్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 150 సీట్ల సాధనే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ చివరకు 99 దగ్గరే ఆగిపోయింది. 22 ఏళ్లపాటు అధికారంలో ఉండటంతో బీజేపీ సర్కారుపై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత కనిపించింది. దీంతో 1990 తర్వాత తొలిసారిగా వంద లోపు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీఎస్టీ, నోట్ల రద్దు అంశాలు కూడా కాషాయం పార్టీ మెజార్టీ తగ్గడానికి కారణాలయ్యాయి.
జీఎస్టీకి, బీజేపీ 150 స్థానాలకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అమిత్ షా 150 స్థానాలు అడిగారు. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో 150 స్థానాలు కోరితే.. గుజరాత్ ప్రజలు 28 శాతం జీఎస్టీ తీసేసి 99 స్థానాల్లో ఆ పార్టీని గెలిపించారనేది ఆ సందేశం సారాంశం. దీన్ని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. లక్ష్మీ ట్వీట్ పట్ల పలువు నెటిజన్లు స్పందిస్తున్నారు. గుజరాత్ ప్రజలు జీఎస్టీకి సరైన సమాధానం చెప్పారని చెబుతున్నారు.
Found this funny.. Amit shah asked for 150 seats out of 182 in Gujarat. Gujju people gave him 99 after deducting 28% GST. 182 * 28%= 51, 150-51=99... — Lakshmi Manchu (@LakshmiManchu) December 19, 2017
జీఎస్టీకి, బీజేపీ 150 స్థానాలకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అమిత్ షా 150 స్థానాలు అడిగారు. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో 150 స్థానాలు కోరితే.. గుజరాత్ ప్రజలు 28 శాతం జీఎస్టీ తీసేసి 99 స్థానాల్లో ఆ పార్టీని గెలిపించారనేది ఆ సందేశం సారాంశం. దీన్ని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. లక్ష్మీ ట్వీట్ పట్ల పలువు నెటిజన్లు స్పందిస్తున్నారు. గుజరాత్ ప్రజలు జీఎస్టీకి సరైన సమాధానం చెప్పారని చెబుతున్నారు.
Found this funny.. Amit shah asked for 150 seats out of 182 in Gujarat. Gujju people gave him 99 after deducting 28% GST. 182 * 28%= 51, 150-51=99... — Lakshmi Manchu (@LakshmiManchu) December 19, 2017