యాప్నగరం

సినిమాలకు గుడ్ బై చెప్పిన మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇక ముందు ఎలాంటి సినిమాల్లో నటించబోనని ఫేస్ బుక్ ద్వారా ప్రకటించి

Samayam Telugu 14 Jun 2017, 11:26 am
హీరో మంచు మనోజ్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇక ముందు ఎలాంటి సినిమాల్లో నటించబోనని ఫేస్ బుక్ ద్వారా ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ఆయన తాజాగా నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంతో పాటు మరో చిత్రం తన చివరి చిత్రాలని స్పష్టం చేశారు. అయితే మనోజ్ తాజా ప్రకటన వెనుక కారణమేంటో వివరించలేదు.
Samayam Telugu manchu monoj says he will not act movies any more
సినిమాలకు గుడ్ బై చెప్పిన మంచు మనోజ్



ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు రెండో తనయుడైన మనోజ్.. మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. ఈ తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్, నూకయ్య, వేదం వంటి చిత్రాలతో అలరించారు.

తాజాగా నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’లో మనోజ్ ఎల్టీటీఈ నేతగా కనిపించనున్నారు. ఇందులో మనోజ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.