యాప్నగరం

ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మంచు విష్ణు.. ఆ సింబల్‌తో వీడియో పోస్ట్ చేసిన 'మా' ప్రెసిడెంట్

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'అలయ్ బలయ్' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, మంచు విష్ణు ఒకే వేదికపైకి రావడం జరిగింది. ఈ మేరకు మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Samayam Telugu 17 Oct 2021, 4:06 pm
నాటకీయ పరిణామాల నడుమ MAA ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నడిచిన హోరీహోరీ పోరులో 'మంచు' వారికే అధ్యక్ష పీఠం దక్కింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్స్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ అందిందనే చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'అలయ్ బలయ్' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, మంచు విష్ణు ఒకే వేదికపైకి రావడం జరిగింది.
Samayam Telugu ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మంచు విష్ణు
Pawan Kalyan at Alai balai Event


గత పదహారేళ్లుగా ప్రతీ ఏటా నిర్వహిస్తున్న ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమంలో ఒకే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు కనిపించారు. పార్టీలకు అతీతంగా నేతలంతా కలుసుకునే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌదర్యరాజన్, హిమాచల్‌ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు, కాంగ్రెస్ నేత మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
వివాదంలో పెళ్లి సందD హీరోయిన్.. ఆస్తిపై కన్నేశారంటూ ఆమె తండ్రి ఆరోపణలు!!
పవన్ కళ్యాణ్ వేదిక వద్ద కూర్చున్న ఓ వీడియో క్లిప్‌ని 'గెస్ హూ' అని కామెంట్ పెట్టారు. ఈ మేరకు ఆయన ఎనర్జీ సింబల్ షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేలా అలయ్ బలయ్‌లో కళాకారుల నృత్యాలు, తెలంగాణ షడ్రుచుల వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.