యాప్నగరం

Lakshmis NTR Release: వర్మకు షాక్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు ఏపీ కోర్టు బ్రేక్!

ఏప్రిల్ 15 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను థియేటర్లలో.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది.

Samayam Telugu 28 Mar 2019, 8:05 pm
వివాదాస్పద సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను రేపు (మార్చి 29న) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ హైకోర్టు సైతం క్లియరెన్స్ ఇచ్చేశాయి. ఇక సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు అనుకుంటోన్న తరుణంలో రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఏప్రిల్ 11న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సినిమా విడుదలను ఆపివేయాలని మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu RGV_NTR


ఏప్రిల్ 15 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను థియేటర్లలో.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ ఇంజక్షన్ ఆర్డర్‌ను దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు‌తో పాటు నిర్మాత రాకేశ్ రెడ్డికి పంపింది. దీంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఆంధ్రప్రదేశ్‌లో బ్రేకులు పడినట్లయింది. ఈ సినిమాకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి, వర్మ రేపు ఈ సినిమాను తెలంగాణలో విడుదల చేస్తారో లేదో చూడాలి. అంతేకాకుండా, ఈ ఇంజక్షన్ ఆర్డర్‌పై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టు ఆశ్రయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.