Mani Ratnam: ‘బాహుబలి’ వార్ సీన్స్పై మణిరత్నం కామెంట్స్.. ఫేక్ అని తెలిసిపోతుందంటూ..
మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్2’ ఈ శుక్రవారం విడుదలైంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కన్నా బాగుందని టాక్ వినిపిస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ‘బాహుబలి, పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలను కంపేర్ చేస్తూ మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రధానాంశాలు:
- ‘బాహుబలి Vs PS2’.. నెట్టింట మొదలైన చర్చ
- రీసెంట్ ఇంటర్వ్యూలో మణిరత్నం క్లారిటీ
- బాహుబలి వార్ సీన్లపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో విక్రమ్ (Vikram), ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తి, జయం రవి, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన మొదటి భాగం ప్రశంసలు అందుకోగా.. ఈ రోజు (ఏప్రిల్ 28) ప్రపంచవ్యాప్తంగా సెకండ్ పార్ట్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే బాహుబలితో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీని పోలుస్తూ నెట్టింట అనేక చర్చలు నడుస్తున్నాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో దర్శకుడు మణిరత్నంకు సైతం ఇదే ప్రశ్న ఎదురవగా.. ఆయన చెప్పిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ను ‘బాహుబలి’తో పోల్చలేదు కానీ వార్ సీన్ల (Bahubali War Scenes) విషయంలో మాత్రం కొన్ని కామెంట్స్ చేశారు. PS2 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలపై తనకున్న అభిమానాన్ని ఓపెన్గా వ్యక్తపరిచాడు మణిరత్నం. బాహుబలితో కంపేరిజన్ గురించి స్పందిస్తూ.. ‘ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పాం. ‘బాహుబలి’ సినిమాను రాజమౌళి మాత్రమే చేయగలడు. మేము PS మొదలుపెట్టినపుడు బాహుబలిలా చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే బాహుబలి స్టోరీ విషయంలో లిబర్టీ ఉంది. అవన్నీ కల్పిత పాత్రలు. సూపర్ హీరోలను తలపిస్తాయి. అంతా ఊహాజనితమే. కానీ ‘పొన్నియిన్ సెల్వన్’ మాత్రం కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. అరుల్మొళి వర్మన్, ఆదిత్య కరికాలన్ నిజమైన వ్యక్తులు. అందుకే వాస్తవికంగా చూపించాలనుకున్నాను’ అని చెప్పారు.
ఇదే విషయంపై మరింత వివరించిన మణిరత్నం.. ‘యుద్ధ సన్నివేశాలు బాహుబలిలా లేవని చెప్తేనే నాకు హ్యాపీ. ఎందుకంటే బాహుబలి చిత్రంలో మాదిరి యుద్ధాన్ని బయటి నుంచి (కెమెరా యాంగిల్లో) పెద్దగా చూపించడం కంటే యుద్ధం లోపల చూపించాలనుకున్నా. ఒకవేళ బయటి నుంచి చూపించినపుడు అది డిజిటల్గా కనిపించి ఫేక్ అని తెలిసిపోతుంది’ అని పేర్కొన్నారు. కాగా.. ఇదే మణిరత్నం, రాజమౌళి విజన్కు మధ్య ఉన్న డిఫరెన్స్ను తెలియజేస్తుంది.
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్గా రవి వర్మన్ పనిచేశారు. ఎ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. స్క్రిప్ట్ను మణిరత్నంతో కలిసి కుమారవేల్ రాశారు. కాగా.. కోలీవుడ్ నుంచి ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాల్లో PS2 ఒకటి కాగా.. ఫస్ట్ పార్ట్ వసూళ్లను సెకండ్ పార్ట్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే విషయంపై మరింత వివరించిన మణిరత్నం.. ‘యుద్ధ సన్నివేశాలు బాహుబలిలా లేవని చెప్తేనే నాకు హ్యాపీ. ఎందుకంటే బాహుబలి చిత్రంలో మాదిరి యుద్ధాన్ని బయటి నుంచి (కెమెరా యాంగిల్లో) పెద్దగా చూపించడం కంటే యుద్ధం లోపల చూపించాలనుకున్నా. ఒకవేళ బయటి నుంచి చూపించినపుడు అది డిజిటల్గా కనిపించి ఫేక్ అని తెలిసిపోతుంది’ అని పేర్కొన్నారు. కాగా.. ఇదే మణిరత్నం, రాజమౌళి విజన్కు మధ్య ఉన్న డిఫరెన్స్ను తెలియజేస్తుంది.
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్గా రవి వర్మన్ పనిచేశారు. ఎ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. స్క్రిప్ట్ను మణిరత్నంతో కలిసి కుమారవేల్ రాశారు. కాగా.. కోలీవుడ్ నుంచి ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాల్లో PS2 ఒకటి కాగా.. ఫస్ట్ పార్ట్ వసూళ్లను సెకండ్ పార్ట్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- Read latest Tollywood updates and Telugu News