యాప్నగరం

మణిరత్నం గుండెపోటు: వాస్తవమిదే..

దర్శక దిగ్గజం మణిరత్నం అస్వస్థతకు గురయ్యారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన ప్రతినిధులు తెలిపారు. గురువారం (జులై 26) మధ్యాహ్నం ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని, దీంతో కుటుంబ సభ్యులు ఆయణ్ని హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి.

Samayam Telugu 26 Jul 2018, 10:55 pm
దర్శక దిగ్గజం మణిరత్నం అస్వస్థతకు గురయ్యారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన ప్రతినిధులు తెలిపారు. గురువారం (జులై 26) మధ్యాహ్నం ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని, దీంతో కుటుంబ సభ్యులు ఆయణ్ని హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అయితే.. మణిరత్నం సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన ప్రతినిధులు, ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు.
Samayam Telugu ratnam


మణిరత్నానికి గుండెపోటు వచ్చిందన్న వార్త గంటల వ్యవధిలో వైరల్‌గా మారాయి. ఈ వార్త విని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. సన్నిహితులు, అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మణిరత్నం కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దీంతో తన ప్రతినిధులు ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. మణిరత్నం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రికి వెళ్లారని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.