యాప్నగరం

నలుగురు స్టార్ హీరోలతో మణిరత్నం ‘నవాబ్’

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరోసారి మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టాడు. నలుగురు హీరోలో పారిశ్రామిక కాలుష్యం నేపథ్యంలో సినిమా ప్రారంభం తీయబోతున్నాడు.

TNN 10 Feb 2018, 1:27 pm
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరోసారి మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టాడు. ‘చెక్క చివంత వానమ్’ పేరిట నలుగురు హీరోలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతిలు ఈ సినిమాలో నటిస్తున్నారు. జ్యోతిక, జయసుధ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు నవాబ్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది.
Samayam Telugu mani ratnams multi starrer project titled chekka chivantha vaanam in tamil and nawab in telugu
నలుగురు స్టార్ హీరోలతో మణిరత్నం ‘నవాబ్’


అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు ఈ సినిమాలో అన్నదమ్ముళ్లుగా కనిపించబోతున్నట్లు సమాచారం. వీరు గ్యాంగ్‌స్టర్లు కాగా, విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. పద్మావత్‌లో నటించి అదితి రావ్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు.

చెక్క చివంత వానమ్ అంటే ఆకాశం ఎర్రబడింది అని అర్థం కాగా.. ఈ సినిమా పారిశ్రామిక కాలుష్యం నేపథ్యంలో తెరకెక్కనుందనే వార్తలు వెలువడుతున్నాయి. సినిమా పోస్టర్ కూడా ఈ రూమర్లకు బలం చేకూర్చేదిగా ఉంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.