మహేష్బాబు సోదరి మంజుల ఘట్టమనేని నటిగా కొన్ని సినిమాల్లో కనిపించారు. నటిగానే కాకుండా నిర్మాణ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నారు. గతంలో ‘కావ్యాస్ డైరీ’, ‘ఏ మాయ చేసావే’ వంటి చిత్రాలను నిర్మించిన మంజుల.. ప్రస్తుతం దర్శకత్వంపై దృష్టి పెట్టారు. అలానే నిర్మాతగా కూడా వేగం పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నానితో ఓ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం నాని నటించిన ‘ఎంసీఏ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నాని పూర్తి చేయనున్నాడు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. దాని తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల నానీని కలిసిన విక్రమ్.. ఓ కథను వినిపించారు. కథ నచ్చడంతో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ సినిమాకు మంజుల నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది.
ప్రస్తుతం నాని నటించిన ‘ఎంసీఏ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నాని పూర్తి చేయనున్నాడు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. దాని తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల నానీని కలిసిన విక్రమ్.. ఓ కథను వినిపించారు. కథ నచ్చడంతో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ సినిమాకు మంజుల నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది.