టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినికి గట్టి కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. జనసేన కార్యకర్తల అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారాయన. మరోసారి ఇలా జరిగితే నేను రోడ్డు మీదికి వచ్చి ఎదుర్కొంటానంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు నాగబాబు. ఈ సందర్భంగా ‘అంతా నా ఇష్టం’ యూట్యూబ్ ఛానల్ ద్వారా 10 నిమిషాలు వీడియోను పోస్ట్ చేశారు నాగబాబు. ఇందులో జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేసి స్టేషన్ ఉంచిని విజువల్స్ని చూపించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘మీకు కొన్ని విజువల్స్ చూపిస్తా వాటిని చూడండి.. ఈ వీడియో కనిపించే వారిని పోలీస్లు అరెస్ట్ చేసి గుంటూరు అరండాల్ పేట పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ నుండి ఎస్పీ బంగ్లాకు తరలించారు. అక్కడ వాళ్లను బాగా కొట్టి హింసించారు. బాగా గాయపడిన ఓ కుర్రాడు అక్కడే వాంతులు చేసుకుంటే.. ఆసుపత్రికి కూడా తరలించారని మాకు సమాచారం.
ఈ విషయం నాకు కాస్త లేటుగా తెలిసింది. నాకు కరెక్ట్ టైమ్లో తెలిస్తే విషయం వేరేలా ఉండేది. సాధినేని యామిని అనే టీడీపీ మహిళా నాయకురాలు మీద జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం అనేది తప్పేంకాదు. కాకపోతే నిజంగా బాధపెట్టేవిగా ఉంటే పరువునష్టం దావా వేయొచ్చు అది సుప్రీం చెప్పింది. అరెస్ట్ చేయకూడదని కోర్టులు చెబుతున్నాయి.
ఒకసారి అరెస్ట్ చేసి మళ్లీ మళ్లీ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇలా చేయడం ద్వారా జనసేన కార్యకర్తల మనస్తైర్యాన్ని దెబ్బకొడుతున్నట్టు భ్రమ పడుతున్నారు తెలుగు దేశం పార్టీ. దీనికి మీ అబ్బాయి లోకేష్, పార్టీ హెడ్గా చంద్రబాబు, ఏపీ హోం మినిష్టర్ చినరాజప్ప బాధ్యత వహించాలి.
ఎందుకంటే వాళ్లు ఏమైనా మర్డర్లు చేశారు, దేశ ద్రోహం చేశారా? టెర్రరిస్టులా.. మానభంగాలు చేశారా.. ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నారు. అధికారంలో ఉన్న మీ నాయకురాలిని ఒక్కమాట అంటే ఇంత దారణంగా వ్యవహరిస్తారా? మీరు మా జనసేన కార్యకర్తల్ని ఎన్నిమాటలు అంటున్నారు. ఎన్నిరకాలుగా హించిస్తున్నారు. దోషుల్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. అరెస్ట్ చేయడం వరకే మీ పని. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రక్తాలు కారేలా కొట్టడమా. సాధినేని యామిని వీళ్ల దగ్గరకు వచ్చి ఆమె కూడా కొట్టినట్టు తెలుస్తోంది. మీ అరాచకాలు ఇంత దారుణంగా ఉన్నాయి. మీకు కాలం దగ్గర పడింది. వచ్చే ఎన్నికలే మీకు సరైన సమాధానం చెబుతాయి.
మా తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు కాబట్టి అతనికి ఇబ్బందులు కలగకూడదని పార్టీలో జాయిన్ కాలేదు. కాని నేను జనసేన అభిమానిని. ఇంకోసారి జనసైనికులపై ఇలాంటి దాడులకు పాల్పడితే.. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తున్నా.
నేను ఓన్లీ ఆన్ లైన్ వారియర్ మాత్రమే కాదు. నాకు బయటకు వచ్చి పోరాడే శక్తి ఉంది. నాకు వయసు ఉంది. భయం లేదు. ఇకపై ఎవరైనా జనసేనను భయపెట్టాలని ప్రయత్నిస్తే.. నేను ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటా. వాళ్ల కోసం పోరాడతా. మీరు నన్ను కొట్టినా చంపేసినా నేను రెడీ.
రండి.. చంపేస్తారా? వచ్చి చంపేయండి. ఒక మంచిపని కోసం చచ్చిపోవడానికి రెడీ. కాని మీలాగా అధికారం చేతిలో ఉంది కదా అడ్డదారిలో వెళ్లం. జనసైనికులు మీ పార్టీని ఎదుర్కొంటారు. వాళ్ల వెనుక నేను ఉన్నాను. బీకేర్ ఫుల్.. ఏదైనా న్యాయంగా పోరాడదాం. రాబోయే ఎలక్షన్స్లో మీరు గెలిచినా.. మేం గెలిచినా.. జగన్ గెలిచినా.. న్యాయంగానే పోరాడదాం. అంతేకాని పగలు, ప్రతీకారాలు పెట్టుకుని.. ఇలా చేయడం దారుణం.
ఇదేనా న్యాయం ఇదేనా చట్టం.. సాధినేని యామినికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పినట్టు పోలీస్లు కొడతారా? ఆమె పోలీస్ల ముందు జనసేన కార్యకర్తల్ని చెంపపై కొడుతుందా? ఒక వేళ చంపేయమంటే చంపేస్తారా? మేం కూడా లా చదువుకున్నాం. దీన్ని పెద్ద ఇష్యూ చేయొచ్చు. కాని చేయదల్చుకోలేదు. మీరు మర్యాదగా ఆ బాధితుల్ని క్షమించమని కోరండి. ఇలాంటి అడ్డదారులలో వెళ్లకండి. మీడియా ఎలాగూ వీటిని ప్రసారం చేయదు. ఎందుకంటే ఛానల్స్ అన్నీ చంద్రబాబుకి సపోర్ట్. కాని మాకు సోషల్ మీడియా ఉంది. ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాం’ అంటూ టీడీపీ నాయకురాలు సాధినేని యామినికి గట్టి కౌంటర్ ఇచ్చారు నాగబాబు.
ఈ విషయం నాకు కాస్త లేటుగా తెలిసింది. నాకు కరెక్ట్ టైమ్లో తెలిస్తే విషయం వేరేలా ఉండేది. సాధినేని యామిని అనే టీడీపీ మహిళా నాయకురాలు మీద జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం అనేది తప్పేంకాదు. కాకపోతే నిజంగా బాధపెట్టేవిగా ఉంటే పరువునష్టం దావా వేయొచ్చు అది సుప్రీం చెప్పింది. అరెస్ట్ చేయకూడదని కోర్టులు చెబుతున్నాయి.
ఒకసారి అరెస్ట్ చేసి మళ్లీ మళ్లీ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇలా చేయడం ద్వారా జనసేన కార్యకర్తల మనస్తైర్యాన్ని దెబ్బకొడుతున్నట్టు భ్రమ పడుతున్నారు తెలుగు దేశం పార్టీ. దీనికి మీ అబ్బాయి లోకేష్, పార్టీ హెడ్గా చంద్రబాబు, ఏపీ హోం మినిష్టర్ చినరాజప్ప బాధ్యత వహించాలి.
ఎందుకంటే వాళ్లు ఏమైనా మర్డర్లు చేశారు, దేశ ద్రోహం చేశారా? టెర్రరిస్టులా.. మానభంగాలు చేశారా.. ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నారు. అధికారంలో ఉన్న మీ నాయకురాలిని ఒక్కమాట అంటే ఇంత దారణంగా వ్యవహరిస్తారా? మీరు మా జనసేన కార్యకర్తల్ని ఎన్నిమాటలు అంటున్నారు. ఎన్నిరకాలుగా హించిస్తున్నారు. దోషుల్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. అరెస్ట్ చేయడం వరకే మీ పని. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రక్తాలు కారేలా కొట్టడమా. సాధినేని యామిని వీళ్ల దగ్గరకు వచ్చి ఆమె కూడా కొట్టినట్టు తెలుస్తోంది. మీ అరాచకాలు ఇంత దారుణంగా ఉన్నాయి. మీకు కాలం దగ్గర పడింది. వచ్చే ఎన్నికలే మీకు సరైన సమాధానం చెబుతాయి.
మా తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు కాబట్టి అతనికి ఇబ్బందులు కలగకూడదని పార్టీలో జాయిన్ కాలేదు. కాని నేను జనసేన అభిమానిని. ఇంకోసారి జనసైనికులపై ఇలాంటి దాడులకు పాల్పడితే.. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తున్నా.
నేను ఓన్లీ ఆన్ లైన్ వారియర్ మాత్రమే కాదు. నాకు బయటకు వచ్చి పోరాడే శక్తి ఉంది. నాకు వయసు ఉంది. భయం లేదు. ఇకపై ఎవరైనా జనసేనను భయపెట్టాలని ప్రయత్నిస్తే.. నేను ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటా. వాళ్ల కోసం పోరాడతా. మీరు నన్ను కొట్టినా చంపేసినా నేను రెడీ.
రండి.. చంపేస్తారా? వచ్చి చంపేయండి. ఒక మంచిపని కోసం చచ్చిపోవడానికి రెడీ. కాని మీలాగా అధికారం చేతిలో ఉంది కదా అడ్డదారిలో వెళ్లం. జనసైనికులు మీ పార్టీని ఎదుర్కొంటారు. వాళ్ల వెనుక నేను ఉన్నాను. బీకేర్ ఫుల్.. ఏదైనా న్యాయంగా పోరాడదాం. రాబోయే ఎలక్షన్స్లో మీరు గెలిచినా.. మేం గెలిచినా.. జగన్ గెలిచినా.. న్యాయంగానే పోరాడదాం. అంతేకాని పగలు, ప్రతీకారాలు పెట్టుకుని.. ఇలా చేయడం దారుణం.
ఇదేనా న్యాయం ఇదేనా చట్టం.. సాధినేని యామినికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పినట్టు పోలీస్లు కొడతారా? ఆమె పోలీస్ల ముందు జనసేన కార్యకర్తల్ని చెంపపై కొడుతుందా? ఒక వేళ చంపేయమంటే చంపేస్తారా? మేం కూడా లా చదువుకున్నాం. దీన్ని పెద్ద ఇష్యూ చేయొచ్చు. కాని చేయదల్చుకోలేదు. మీరు మర్యాదగా ఆ బాధితుల్ని క్షమించమని కోరండి. ఇలాంటి అడ్డదారులలో వెళ్లకండి. మీడియా ఎలాగూ వీటిని ప్రసారం చేయదు. ఎందుకంటే ఛానల్స్ అన్నీ చంద్రబాబుకి సపోర్ట్. కాని మాకు సోషల్ మీడియా ఉంది. ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాం’ అంటూ టీడీపీ నాయకురాలు సాధినేని యామినికి గట్టి కౌంటర్ ఇచ్చారు నాగబాబు.