యాప్నగరం

‘శ్రీవల్లీ’ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌‌గా చెర్రీ

​ ‘బాహుబలి’ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి.

TNN 9 Sep 2017, 4:47 pm
‘బాహుబలి’ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్న ఈమూవీని రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 10న గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో భారీగా జరుపనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు.
Samayam Telugu mega power star as chief guest for srivalli pre release event
‘శ్రీవల్లీ’ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌‌గా చెర్రీ


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిత్రీకరణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకధీర రాజమౌళి గారు మా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చి మా టీంకి విషెష్ తెలుపుతుండటం వంటివి నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం.

శ్రీవల్లి ఈ నెల 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ శ్రీలేఖ సంగీతం అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.