విశాఖసాగర తీరం ‘రంగస్థలం’ నామస్మరణతో మారుమోగుతోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా ఈవెంట్ ‘రంగస్థలం ప్రి రిలీజ్’కు వైజాగ్లోని ఆర్కే బీచ్ రెడీ కావడంతో సముద్రతీరానికి అభిమానులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈవెంట్కు రామ్ చరణ్ సతీసమేతంగా హాజరై అభిమానులు ఉత్సాహపరచారు. ‘రంగస్థలం’ రామలక్ష్మి .. సమంత బ్యూటిఫుల్ లుక్స్తో అభిమానుల్ని ఫిదా చేసింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ మెగా ఈవెంట్లో ఆయన చేతుల మీదుగా ‘రంగస్థలం’ థియేట్రికల్ ట్రైలర్ను మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. వైభవంగా జరుగుతున్న ఈ ప్రి రిలీజ్ ఈవెంట్కు సీనియర్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తుండగా.. దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, రంగస్థలం పాటల రచయిత చంద్రబోస్లతో పాటు ఈ చిత్రంలో నటించిన అనసూయ, ఆది తదితరులు హాజరయ్యారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ మూవీపై అటు మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన చిట్టిబాబు, రామలక్ష్మిల టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపగా.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ మూవీపై అటు మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన చిట్టిబాబు, రామలక్ష్మిల టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపగా.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.