యాప్నగరం

లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి ఉద్వేగం

ప్రముఖ నటి, రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి మృతికి సంతాపం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం లక్ష్మీదేవి (78) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

TNN 3 Feb 2018, 6:00 pm
ప్రముఖ నటి, రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి మృతికి సంతాపం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం లక్ష్మీదేవి (78) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా తనకు నటనలో మెలకువలు నేర్పిన లక్ష్మీదేవి మరణం తీరని లోటు అన్నారు మెగాస్టార్. ‘ఆమెకు శిష్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా.. లక్ష్మీ దేవి కనకాల భౌతికంగా దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అన్నారు.
Samayam Telugu mega star chiranjeevi condolence to lakshmi devi kanakala death
లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి ఉద్వేగం


ఆ కళామ తల్లి పేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రకటనలో తెలిపారు.

లక్ష్మీ దేవి మరణంతో విషాదంలో ఉన్న రాజీవ్ కనకాల, సుమ దంపతులను ఫోన్‌లో పరామర్శించారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్‌లో లేకపోవడంతో ఫోన్ ద్వారా మాట్లాడారు. కాగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో లక్ష్మీదేవి అంత్యక్రియలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.