యాప్నగరం

Chiranjeevi: ప్రాణపాయస్థితిలో మెగాభిమాని.. నేనున్నాంటూ చిరంజీవి అభయ హస్తం

ఆపదలో ఉన్న అభిమానికి అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). క్యాన్సర్ బారిన పడిన వీరాభిమానిని హైదరాబాద్‌లో ఓమెగా ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అతడిని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 16 Aug 2022, 7:27 pm
అతను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి వీరాభిమాని. చిరంజీవి స్ఫూర్తితో ఎంతోమందికి సేవ చేశాడు. సమాజ సేవలో ముగినిపోయి పేదలకు అండగా నిలిచాడు. అలాంటి వీరాభిమాని క్యాన్సర్ బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్.. ఆ వీరాభిమానికి పిలుపు పంపించారు. వెంటనే హైదరాబాద్‌కు పిలిపించి.. మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకి వెళితే..
Samayam Telugu Megastar Chiranjeevi Helps his Fan
అభిమానిని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి


కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌కు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. తన హీరో బాటలోనే నడుస్తూ.. నిత్యం సమాజ సేవలో మునిగిపోయాడు. ఎవరు ఆపదలో ఉన్నా.. నేనున్నాంటూ వెంటనే స్పందించేవాడు. మెగా అభిమానుల తరపున ఆదుకుని అండగా నిలిచేవాడు. అయితే దురదృష్టం కొద్ది చక్రధర్‌కి క్యాన్సర్ సోకింది. గత కొన్నాళ్ల నుంచి అతను అనారోగ్యంతో ఉన్నారన్న విషయం చిరంజీవికి తెలిసింది.

వెంటనే రంగంలోకి దిగి.. చక్రధర్‌ను హైదరాబాద్ పిలిపించి ఒమెగా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు మెగాస్టార్. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి చక్రధర్‌ను పరామర్శించారు. ఆసుపత్రి డాక్టర్స్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. చక్రధర్‌కు అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు కూడా చిరంజీవి భరోసా ఇచ్చారు. ఇటీవలె తన సొంతూరు (మొగల్తూరు) అభిమాని చివరి కోరికను మెగాస్టార్ నెరవేర్చిన సంగతి తెలిసిందే. తన ఇంటికి పిలుపించుకుని మాట్లాడి.. ఆర్థికసాయం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.