యాప్నగరం

Chiranjeevi: అలీని పరామర్శించిన చిరంజీవి

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. అలీ ప్రాణంగా చూసుకుంటున్న తన తల్లిని పోగొట్టుకున్నారు.

Samayam Telugu 19 Dec 2019, 1:39 pm
మెగాస్టార్ చిరంజీవి కమెడియన్ అలీని పరామర్శించారు. అలీ తల్లి జైతున్ బీబీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు కన్నుమూశారు. ఈ విషయం తెలిసి వెంటనే చిరంజీవి అలీ ఇంటికి వెళ్లారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన అలీని పరామర్శించారు. బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తన తల్లి చనిపోయినప్పుడు అలీ షూటింగ్ నిమిత్తం ఝార్ఖండ్‌లో ఉన్నారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తన తల్లి ఇక లేదని తెలిసి అలీ కన్నీరుమున్నీరయ్యారు.
Samayam Telugu ali
అలీ


READ ALSO: జీవితంలో అది మాత్రం చేయలేనంటున్న విజయ్ దేవరకొండ

వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలీ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. ముఖ్యంగా తన తల్లి అంటే అలీకి పంచ ప్రాణాలు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులేనని అలీ చాలా సందర్భాల్లో చెప్పారు. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా తన తల్లితో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు.

READ ALSO: ‘‘బాలకృష్ణ ఫ్యాన్స్‌కి భయపడి పారిపోవాల్సి వచ్చింది’’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.