యాప్నగరం

Chiranjeevi: `ఆయన నాకు గురువు లాంటి వారు`.. కన్నీరు పెట్టుకున్న మెగాస్టార్‌

చెన్నైలోని గొల్లపూడి మారుతీరావు నివాసానికి వెళ్ళిన మెగాస్టార్‌ చిరంజీవి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చిరు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Samayam Telugu 15 Dec 2019, 12:53 pm
టాలీవుడ్ సీనియర్‌ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువరు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి కుంటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
Samayam Telugu Chiranjeevi Gollapudi
గొల్లపూడి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న చిరంజీవి


చెన్నైలోని గొల్లపూడి మారుతీరావు నివాసానికి వెళ్ళిన మెగాస్టార్‌ చిరంజీవి ఆయనకు నివాళులర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చిరు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవితో పాటు నటి సుహాసిని, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గొల్లపూడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్.
Also Read: ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ``ఐ లవ్యు` సినిమా చేస్తున్నప్పుడు.. నేను డైలాగులు పలకటం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆ సినిమా కోసం ఆయన దగ్గర శిష్యరికం కూడా చేశాను. గొల్లపూడి గారు నాకు గురువు లాంటి వారు. తరువాత మేము ఇద్దరం కలిసి `ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య` సినిమాలో నటించాము. ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేనిది. సినీ పరిశ్రమకు ఆయనలేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా` అన్నారు.

గొల్లపూడి కుమారుడు విదేశాల్లో ఉండటంతో ఆయన వచ్చే వరకు అంత్యక్రియలు వాయిదా వేశారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని టీ నగర్‌ కన్నమ్మ పేట స్మశాన వాటిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు తరలి వస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.