యాప్నగరం

‘నేను మీలాగే ఎదురు చూస్తున్నాను’.. పవన్‌ ఫ్యాన్స్‌ని శాంతపరుస్తూ చిరంజీవి ట్వీట్

ఎపీ సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులను శాంతపరుస్తూ.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ ఇఫ్పుడు వైరల్‌గా మారింది.

Samayam Telugu 8 Apr 2021, 6:41 pm
సినిమా థియేటర్లకు రాయితీలు కల్పిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. చిరంజీవి మాత్రం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా జగన్‌కు మద్దుతగా ఎలా ట్వీట్ చేస్తారంటూ.. పవన్ అభిమానులు ఆయనపై మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ అభిమానులు ఆయన్ని ఘోరంగా ట్రోల్ చేశారు.
Samayam Telugu చిరంజీవి మరిము పవన్‌కళ్యాణ్
Chiranjeevi And Pawan Kalyan


అయితే చిరంజీవి అనే వ్యక్తి లేకుంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యేవాడే కాదని.. అలాంటి వ్యక్తిని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం నిజంగా హాస్యాస్పదం అంటూ చిరు అభిమానులు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ సర్వత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు సంవత్సరాల విరామం తర్వాత పవన్‌కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా పవన్‌కి అభినంనలు తెలుపుతూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ‘‘చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ని వెండితెరపై చూసేందుకు మీ అందరిలాగానే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబసభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌సాబ్‌ చూస్తాను. ఆ తర్వాత నా స్పందనని మీ అందరితో ఎప్పుడు పంచుకుంటానా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నా’’ అంటూ చిరు పేర్కొన్నారు.

దీంతో పాటు పవన్‌కి తాను హెయిర్‌స్టైల్ చేస్తున్న ఓ అరుదైన ఫొటోని కూడా చిరంజీవి జత చేశారు. అయితే ఏపీ సీఎం జగన్ విషయంలో చిరుపై గుర్రుగా ఉన్న పవన్ అభిమానులను శాంతపరిచేందుకే మెగాస్టార్ ఈ ట్వీట్ చేశారా..? అని అంతా అనుకుంటున్నారు. ఈ ట్వీట్ చూసిస పవన్ అభిమానులు ‘సూపర్ బాస్’, ‘మేము కూడా పీకేని ఎప్పుడు థియేటర్‌లో చూస్తామా అని ఎదురు చూస్తున్నాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

బోణీ కపూర్ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్‌ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.