మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జనతా గ్యారేజ్, మన్యం పులి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . అయితే ఇటీవల మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్తో ‘మహాభారతం’ ప్రాజెక్ట్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుండగా .. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మూవీపై బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ చేసిన సంచలన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
‘ మోహన్ లాల్ సార్... మీరు చూస్తే ఛోటా భీమ్లా ఉన్నారు. మీ లాంటి వారు మహాభారతంలో భీముడి పాత్రను ఎలా చేస్తారు. అసలు మోహన్ లాల్కు అంత సీన్ ఉందా? వెయ్యి కోట్లు మోహన్ లాల్పై పెడితే మనీ వేస్ట్ తప్ప ఏం ఉండదు’ అంటూ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్గా మారింది.
Sir @Mohanlal you look like Chota Bheem so then how will u play role of Bheem in Mahabharata? Why do you want to waste money of B R shetty? — KRK (@kamaalrkhan) April 18, 2017
ఇదిలా ఉంటే కమల్ రషీద్ ఖాన్ చేసిన కామెంట్స్పై ‘మహా భారతం’ టీం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ ప్రాజెక్ట్ మోహన్ లాల్ లేకుంటే ముందుకు వెళ్లేదే కాదు. ఇందులో భీముడి పాత్రకు మోహన్ లాల్ తప్ప మరెవ్వరూ సెట్ కారని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు తమ అభిమాన నటుడ్ని కించపరుస్తూ.. కమల్ రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల మోహన్ లాల్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఏ స్థాయి ఉందని కమల్ మోహన్ లాల్పై కామెంట్స్ చేస్తున్నారో పరిశీలించుకోవాలని చురకలు అంటిస్తున్నారు.
మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బి.ఆర్.శెట్టి అనే నిర్మాత రూ. వెయ్యి కోట్లతో సినిమాను తీయబోతున్నారు. ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను ఈ సినిమాను రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2018 సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉండగా.. 2020 నాటికి మొదటి భాగం విడుదలయ్యే అవకాశం ఉంది.
‘ మోహన్ లాల్ సార్... మీరు చూస్తే ఛోటా భీమ్లా ఉన్నారు. మీ లాంటి వారు మహాభారతంలో భీముడి పాత్రను ఎలా చేస్తారు. అసలు మోహన్ లాల్కు అంత సీన్ ఉందా? వెయ్యి కోట్లు మోహన్ లాల్పై పెడితే మనీ వేస్ట్ తప్ప ఏం ఉండదు’ అంటూ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్గా మారింది.
Sir @Mohanlal you look like Chota Bheem so then how will u play role of Bheem in Mahabharata? Why do you want to waste money of B R shetty? — KRK (@kamaalrkhan) April 18, 2017
ఇదిలా ఉంటే కమల్ రషీద్ ఖాన్ చేసిన కామెంట్స్పై ‘మహా భారతం’ టీం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ ప్రాజెక్ట్ మోహన్ లాల్ లేకుంటే ముందుకు వెళ్లేదే కాదు. ఇందులో భీముడి పాత్రకు మోహన్ లాల్ తప్ప మరెవ్వరూ సెట్ కారని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు తమ అభిమాన నటుడ్ని కించపరుస్తూ.. కమల్ రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల మోహన్ లాల్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఏ స్థాయి ఉందని కమల్ మోహన్ లాల్పై కామెంట్స్ చేస్తున్నారో పరిశీలించుకోవాలని చురకలు అంటిస్తున్నారు.
మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బి.ఆర్.శెట్టి అనే నిర్మాత రూ. వెయ్యి కోట్లతో సినిమాను తీయబోతున్నారు. ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను ఈ సినిమాను రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2018 సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉండగా.. 2020 నాటికి మొదటి భాగం విడుదలయ్యే అవకాశం ఉంది.