యాప్నగరం

‘నాగేశ్వరరావు’ ఆగిపోలేదు.. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ: పరశురామ్

డైరెక్టర్ పరశురామ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో మూవీ ఆగిపోలేదు. మహేష్ బాబుతో సినిమా తరవాత చైతూతో పరశురామ్ పనిచేయనున్నారు.

Samayam Telugu 30 Apr 2020, 7:09 pm
‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత డైరెక్టర్ పరశురామ్.. అక్కినేని నాగచైతన్య హీరోగా సినిమాను ప్రకటించారు. 14 రీల్స్ బ్యానర్‌లో ఈ సినిమాను ప్రారంభించారు. ఇది నాగచైతన్యకు 20వ సినిమా. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని అప్పట్లో ప్రకటించారు. అయితే, పరశురామ్ - నాగచైతన్య సినిమా ఆగిపోయిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu నాగచైతన్య, పరశురామ్
Akkineni Naga Chaitanya


మహేష్ బాబుతో సినిమాను పరశురామ్‌ అంగీకరించడంతో నాగచైతన్యతో చేయాల్సిన మూవీ నుంచి ఆయన తప్పుకున్నారని వదంతులు వచ్చాయి. పరశురామ్ తీసుకున్న నిర్ణయంతో నాగార్జున కూడా కోపంగా ఉన్నారని కూడా అన్నారు. అయితే, ఈ వదంతుల్లో నిజంలేదని పరశురామ్ స్పష్టం చేశారు.

Also Read: ‘ఒక్కడు’ చూసి ఇండస్ట్రీకి వచ్చా.. నా కల నెరవేరుతోంది: పరశురామ్

‘‘నాగచైతన్యతో సినిమా రద్దుకాలేదు. ‘నాగేశ్వరరావు’ అని టైటిల్ పెట్టాం. మేమిద్దరం ఆ సినిమా కచ్చితంగా చేస్తాం. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుంది. ఆ సినిమా విషయంలో మేం వెనక్కి తగ్గం’’ అని పరశురామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ‘చిచోర్’కు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం పరశురామ్ స్పందించలేదు.

ఇదిలా ఉంటే, పరశురామ్‌తో సినిమా చేయడానికి ముందు నాగచైతన్య మరో రెండు సినిమాలు చేస్తారని రూమర్. 20వ సినిమాను డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో, 21వ సినిమాను విక్రమ్ కె. కుమార్‌తో చేస్తారని.. ఆ తరవాత 22వ సినిమాగా ‘నాగేశ్వరరావు’ చిత్రాన్ని చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగచైన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.