యాప్నగరం

పవన్ క్రేజ్‌కి.. ముంబయి ఏజెన్సీ షాక్

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిర..మిర.. మీసం పాటకి అభిమానుల నుంచి భారీగా స్పందన

TNN 8 Mar 2017, 12:20 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోల సినిమా పంక్షన్ ఏదైనా పవన్ కల్యాణ్ నామస్మరణతో అభిమానులు ఊగిపోతారు. ఇప్పుడు తాజాగా ముంబయిలోని ఓ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అభిమానుల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ చూసి షాక్‌కి గురైందట. మార్చి 24న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కాటమరాయుడు’ సినిమా ప్రమోషన్ బాధ్యతలను నిర్మాత శరత్ మరార్ సదరు డిజిటల్ ఏజెన్సీకి ఇటీవల అప్పగించారు.
Samayam Telugu mumbai agency shocked with pawans craze
పవన్ క్రేజ్‌కి.. ముంబయి ఏజెన్సీ షాక్


కొద్ది రోజుల ముందు విడుదలైన కాటమరాయుడు టీజర్, గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిర..మిర.. మీసం పాటకి అభిమానుల నుంచి భారీగా స్పందన రావడంతో ఏజెన్సీ ఆశర్చపోయిందట. ఇప్పటి వరకు టీజర్‌ను 96లక్షల మంది వీక్షించగా.. పాటను 29 లక్షల మంది చూశారు. శరత్ మరార్‌కి డిజిటల్ మీడియాపై మంచి అవగాహన ఉండటంతోనే ఈ ఏజెన్సీని ఎంచుకుని సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. డాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెండోసారి పవన్ కల్యాణ్‌ సరసన శ్రుతి హాసన్ ఆడిపాడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.