యాప్నగరం

మర్డర్ మిస్టరీతో వచ్చిన మంచు లక్ష్మి!

నటిగా, నిర్మాతగా వైవిధ్యభరిత సినిమాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న మరో సినిమాతో వచ్చారు

Samayam Telugu 8 Jun 2018, 1:17 pm
నటిగా, నిర్మాతగా వైవిధ్యభరిత సినిమాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న మరో సినిమాతో వచ్చారు. ఈ సారి ట్రైలర్‌తో ఆసక్తిని రేపుతున్నారామె. లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సారి ఒక మర్డర్ మిస్టరీతో వచ్చినట్టుగా ఉంది మోహన్ బాబు తనయ.
Samayam Telugu woram


భర్త పాత్ర హత్యకు గురికాగా, దానిపై పోలిసులకు ఫిర్యాదు చేసి, మరోవైపు హీరోయిన్ కూడా హత్య ఎవరు చేశారనే అంశంపై పరిశోధించే కథాంశం ఇది.. అని ట్రైలర్‌ చెబుతోంది. ఒకటిన్నర నిమిషం వ్యవధిలో ఉన్న ట్రైలర్ ఎక్కడా ఆసక్తిని తగ్గనీయకుండా, సినిమాపై అంచనాలను కలిగించే విధంగా ఉంది. మర్డర్ మిస్టరీ మీద ఒక థ్రిల్లింగ్ సినిమాను చూపిస్తామనే భరోసాను ఇస్తున్నారు దీని రూపకర్తలు.

అయితే ఈ ట్రైలర్ మరో సినిమాను గుర్తు చేస్తూ ఉంది. అదే ‘కహానీ’. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో హిందీలో రూపొంది సూపర్ హిట్ అయి, దక్షిణాదిన కూడా నయనతార ప్రధాన పాత్రలో రూపొందింది ‘కహానీ’. భర్త కనబడకుండా పోవడంపై ఒక మహిళ సాగించే పరిశోధనగా ఆ సినిమాను రూపొందించారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చారు. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్ కూడా కహానీని గుర్తు చేస్తుంది. అయితే ఈ సినిమా అసలు కథ ఏమిటో తెలియదు కాబట్టి.. ఇప్పుడే ఏం కామెంట్ చేయడానికి లేదు. ట్రైలర్ అయితే.. ఆసక్తిని రేపుతోంది.

మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. విజయ్ యెలకంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆదర్శ్ బాలకృష్ణ‌, సామ్రాట్, ప్రియదర్శిలు ముఖ్యపాత్రలో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.