‘దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా’ అంటూ కొన్ని నెలల క్రితం ‘లవ్స్టోరి’ సినిమా నుంచి ‘సారంగ దరియా’ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. పూర్తి జానపద పదాలతో సాగే ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు.. యూట్యూబ్తో పాటు ఇతర మాద్యమాల్లో కూడా మంచి రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ పాటకు ఎంత పాపులారిటీ వచ్చిందో.. అంతే వివాదాలు కూడా వచ్చాయి. తన అనుమతి లేకుండా తన పాటని సినిమాలో పాడుకున్నారు అంటూ అప్పట్లో ఓ గాయని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత చిత్ర యూనిట్ ఆమెతో మాట్లాడటంతో ఈ వివాదం కుదుటపడింది.
అయితే చాలాకాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లవ్స్టోరి’ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కాలేకపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పరిస్థితులు మెరుగుకావడంతో ఈ సెప్టెంబర్ 24వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 19వ) తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. గాయని గాయకులు ఈ సినిమాలో పాటు పాడుతూ.. ఈవెంట్కు వచ్చిన వారిని సినిమాలోని పాటలు పాడి అలరించారు.
అయితే సినిమాకు పని చేసిన ఒక్కొక్కరిని యాంకర్ సుమ స్టేజీ మీదకు ఆహ్వానించగా.. వాళ్లు సినిమాలో పని చేసిన అనుభవాన్ని పంచుకోవడంతో పాటు.. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్.. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కమ్ములతో కలిసి ఉన్న ఈ రెండు సంవత్సరాల్లో తాను ఎంతో నేర్చుకున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. అన్నికంటే ఎక్కువగా మనవత్వాన్ని శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్నాను అని తెలిపారు. ఇక ‘సారంగ దరియా’ గురించి సుమ ప్రశ్నించగా.. అసలు తన పాట ఇంత హిట్ అయిందంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు.
అయితే చాలాకాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లవ్స్టోరి’ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కాలేకపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పరిస్థితులు మెరుగుకావడంతో ఈ సెప్టెంబర్ 24వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 19వ) తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. గాయని గాయకులు ఈ సినిమాలో పాటు పాడుతూ.. ఈవెంట్కు వచ్చిన వారిని సినిమాలోని పాటలు పాడి అలరించారు.
అయితే సినిమాకు పని చేసిన ఒక్కొక్కరిని యాంకర్ సుమ స్టేజీ మీదకు ఆహ్వానించగా.. వాళ్లు సినిమాలో పని చేసిన అనుభవాన్ని పంచుకోవడంతో పాటు.. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్.. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కమ్ములతో కలిసి ఉన్న ఈ రెండు సంవత్సరాల్లో తాను ఎంతో నేర్చుకున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. అన్నికంటే ఎక్కువగా మనవత్వాన్ని శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్నాను అని తెలిపారు. ఇక ‘సారంగ దరియా’ గురించి సుమ ప్రశ్నించగా.. అసలు తన పాట ఇంత హిట్ అయిందంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు.