నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనికి కారణం అడవులు నాశనం కావడం. మనకు ప్రాణవాయువును అందించేవి అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడేవి అడవులు. అలాంటి అడవులు అగ్నికి ఆహుతైపోతే.. వన్యప్రాణులను కార్చిచ్చు మింగేస్తే ఆ బాధ మన గుండెల్ని దహించేస్తుంది. ప్రస్తుతం అనసూయ ఇలాంటి బాధనే వ్యక్తపరిచారు.
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన అడవులు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అలాంటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాలి బూడుదవుతోంది. భూమికి ఊపిరితిత్తులుగా చెప్పుకునే అమెజాన్ ఫారెస్ట్ పదిహేను రోజులకు పైగా దగ్ధమవుతోంది. హెక్టార్ల కొద్దీ చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. దక్షిణ అమెరికా వ్యాప్తంగా దట్టంగా అలుముకొని ఉన్న రెయిన్ ఫారెస్ట్ ఇది. బ్రెజిల్ వద్ద అమెజాన్ అడవుల్లో అట్టుకున్న కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వేలకొద్ది వన్యప్రాణులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ కార్చిచ్చుపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీనిపై ఇప్పుడు అనసూయ స్పందించారు.
Also Read: దహించిపోతోన్న ‘లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్’.. మహేష్, బన్నీ ఆవేదన
‘‘బాధ, నొప్పితో నా గుండె బద్ధలై రక్తం కారుతోంది. మనిషి అని పిలువబడే రాక్షసుడు దురాశతో ఎంతవరకు వెళ్తాడు. ఇంకా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఒకరి కోసం ఒకరు బతకాలని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాడు. మానవత్వం అనే పదాన్ని దయచేసి తీసేయండి. ఎందుకంటే అది ఇప్పుడు లేదు. ఓ దేవుడా! దయచేసి మమ్మల్ని ఎప్పటికీ క్షమించొద్దు. ఇలాంటి దుస్థితి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మూగదైన ఈ అభయారణ్యానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా స్పందించి తగుచర్యలు తీసుకోకపోతే ఆ తరవాత విచారం వ్యక్తం చేయడం తప్ప ఏమీ మిగలదు’’ అని అనసూయ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన అడవులు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అలాంటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాలి బూడుదవుతోంది. భూమికి ఊపిరితిత్తులుగా చెప్పుకునే అమెజాన్ ఫారెస్ట్ పదిహేను రోజులకు పైగా దగ్ధమవుతోంది. హెక్టార్ల కొద్దీ చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. దక్షిణ అమెరికా వ్యాప్తంగా దట్టంగా అలుముకొని ఉన్న రెయిన్ ఫారెస్ట్ ఇది. బ్రెజిల్ వద్ద అమెజాన్ అడవుల్లో అట్టుకున్న కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వేలకొద్ది వన్యప్రాణులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ కార్చిచ్చుపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీనిపై ఇప్పుడు అనసూయ స్పందించారు.
Also Read: దహించిపోతోన్న ‘లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్’.. మహేష్, బన్నీ ఆవేదన
‘‘బాధ, నొప్పితో నా గుండె బద్ధలై రక్తం కారుతోంది. మనిషి అని పిలువబడే రాక్షసుడు దురాశతో ఎంతవరకు వెళ్తాడు. ఇంకా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఒకరి కోసం ఒకరు బతకాలని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాడు. మానవత్వం అనే పదాన్ని దయచేసి తీసేయండి. ఎందుకంటే అది ఇప్పుడు లేదు. ఓ దేవుడా! దయచేసి మమ్మల్ని ఎప్పటికీ క్షమించొద్దు. ఇలాంటి దుస్థితి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మూగదైన ఈ అభయారణ్యానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా స్పందించి తగుచర్యలు తీసుకోకపోతే ఆ తరవాత విచారం వ్యక్తం చేయడం తప్ప ఏమీ మిగలదు’’ అని అనసూయ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేశారు.