కన్నడ నటి మైత్రేయ గౌడకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఆమె వెంటనే బెయిలుపై విడుదలైంది. పూర్తి వివరాల ప్రకారం... 2011లో ఓసారి మైత్రేయ తన స్నేహితురాళ్లతో కలిసి బెంగుళూరులో కారులో వెళుతోంది. ఆమె డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతోంది. దాంతో శివకుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమె కారును ఆపాడు. మైత్రేయ, ఆమె స్నేహితులు శివకుమార్ పై దాడి చేశారు. శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయిదేళ్ల తరువాత తుది తీర్పు ఇప్పుడు వెల్లడించింది కోర్టు. మైత్రేయకు రెండేళ్లు, ఆమె స్నేహితులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది నగర్ మెజిస్ట్రేట్ కోర్టు. కాగా ఆ వెంటనే బెంగళూరు అయిదో ఏసీఎంఎం కోర్టు బెయిలు మంజూరు చేసింది.
నటికి జైలు శిక్ష... వెంటనే బెయిలు
కన్నడ నటి మైత్రేయ గౌడకు రెండేళ్ల జైలు శిక్ష పడింది.
TNN 14 May 2016, 8:07 am