యాప్నగరం

Naga Shourya Ashwathama ‘అశ్వథ్థామ’ ట్రైలర్: ఆడపిల్ల చావుపై నాగశౌర్య థ్రిల్లింగ్ కథ రాశాడే!

నాగ శౌర్య, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అశ్వ‌థ్థామ‌’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది.

Samayam Telugu 23 Jan 2020, 7:10 pm
‘ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు’?.. అంటూ నాగశౌర్య ‘అశ్వథ్థామ’ ట్రైలర్‌తో ఆసక్తిరేకెస్తున్నారు. ఈ రెండు లైన్ల‌తో సినిమా ఎలా ఉండబోతుంది.. ‘అశ్వథ్థామ’ సినిమాలో ఏం చూపించబోతున్నారన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.
Samayam Telugu Naga Shaurya
అశ్వథ్థామ ట్రైలర్


‘రాక్షసుణ్ణీ, భగవంతుణ్ణీ చూసిన కళ్లు.. ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతే’.. అనే డైలాగుతో స్టార్ట్ అయిన ‘అశ్వథ్థామ’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఆడపిల్ల చావు మీద మీకెందుకు బాబు అంత ఇంట్రెస్టు.. దాని మీద వంద కథలు, వెయ్యి పుకార్లు పుట్టించేదాకా మీకు నిద్ర పట్టదే’అంటూ ఓ ముసలాయన చెప్పే డైలాగ్ హార్ట్ టచ్చింగ్‌గా ఎమోషనల్‌గా అనిపిస్తుంది.

ఛలో చిత్రంతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగశౌర్య తొలిసారి క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా నాగశౌర్య కథను అందించగా.. రమణ తేజ దర్శకత్వం వహించారు. నాగశౌర్యకు జోడీగా మెహ్రీన్ నటించింది. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించగా.. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ట్రైలర్‌లో గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ‘అశ్వథ్థామ’.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.