యాప్నగరం

నాగశౌర్య, రీతువర్మ జంటగా సినిమా ప్రారంభం

ఇటీవల ‘అశ్వథ్థామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించారు. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రం ప్రారంభమైంది.

Samayam Telugu 13 Feb 2020, 3:22 pm
యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతువర్మ జంటగా సినిమా ప్రారంభమైంది. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఫిల్మ్ నగర్‌లోని సితార ఎంటర్‌టైన్మెంట్స్ కార్యాలయంలో ఉదయం 10.08 నిమిషాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
Samayam Telugu Naga Shaurya, Ritu Varma
నాగశౌర్య, రీతువర్మ

ఈనెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించి ఇతర నటీనటలు, సాంకేతిక వర్గం వివరాలు మరికొద్ది రోజులలో ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

Also Read: RX 100 హీరోతో అల్లు అరవింద్ సినిమా.. ‘చావు కబురు చల్లగా..!’

కాగా, నాగశౌర్య ఇటీవల ‘అశ్వథ్థామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఈ సినిమాను నిర్మించారు. నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాత. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమయ్యారు. మహిళలపై జరుగుతోన్న అకృత్యాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు నాగశౌర్య స్వయంగా కథను అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.