యాప్నగరం

బ్యాక్ టు నార్మల్.. కోలుకుంటున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు కరోనా నుంచి కోలుకున్నారు. తనకు కరోనా సోకినట్టు ఈనెల 16న నాగబాబు ప్రకటించారు.

Samayam Telugu 26 Sep 2020, 8:48 pm
మెగా బ్రదర్ నాగబాబు కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఒక ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘‘బ్యాక్ టు నార్మల్. ఉరుము తరవాత వచ్చే నిశ్శబ్దం.. నాకు నేనుగా బాగున్నాను’’ అని నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. నాగబాబు ప్రకటనపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu నాగబాబు
Nagababu


కాగా, తనకు కరోనా వైరస్ సోకిందని ఈనెల 16న నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఒక ఇన్ఫెక్షన్ ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మార్చుకోవచ్చు. కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో పోరాడి ప్లాస్మా దాతను కావాలి’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. కానీ, కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేస్తాననే భరోసా ఆయనే స్వయంగా అభిమానులకు కలుగజేశారు.

కరోనా సోకినట్టు ప్రకటించిన రోజు నుంచీ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణిస్తే సోషల్ మీడియా ద్వారా నాగబాబు సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు.. తన అన్నయ్య చిరంజీవికి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను గుర్తుచేసుకుంటూ ఒక వీడియో కూడా చేశారు. త్వరలోనే ఆయన ‘అదిరింది’ షూటింగ్‌లో కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
View this post on Instagram Back2Normal The Silence After the Storm. Good to be Me by Myself.. #nagababutalks A post shared by Naga Babu Konidela (@nagababuofficial) on Sep 25, 2020 at 11:33pm PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.