యాప్నగరం

బిగ్‌బాస్ విన్నర్‌ని ప్రకటించేది ఆ ‘కోటీశ్వరుడే’!

బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనల్ దశకు చేరుకోవడంతో ఈ షోకి శుభం కార్డు పడనుంది. ఫైనల్ రేస్‌లో శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, నవదీప్, అర్చనలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.

TNN 23 Sep 2017, 5:03 pm
బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనల్ దశకు చేరుకోవడంతో ఈ షోకి శుభం కార్డు పడనుంది. ఫైనల్ రేస్‌లో శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, నవదీప్, అర్చనలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ఈ టైటిల్ విన్నర్ ఎవరు? అన్న టెన్షన్‌‌కు తెరదించి 50 లక్షల ప్రైజ్ మనీని ఎవరి చేతుల మీదుగా ‘బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌కు అందిస్తారన్న దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తిఉంది.
Samayam Telugu nagarjuna is chief guest for bigg boss telugu grand finale
బిగ్‌బాస్ విన్నర్‌ని ప్రకటించేది ఆ ‘కోటీశ్వరుడే’!


ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనల్ విన్నర్‌ను ప్రకటించే ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుండటంతో ఆ ఎపిసోడ్‌ను చాలా స్పెషల్‌గా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇక శని ఆదివారాల్లో హోస్టింగ్ చేసే ఎన్టీఆర్ శనివారం బ్రేక్ తీసుకుని ఆదివారం ఎపిసోడ్‌కోసం రెడీ అవుతున్నారు. ఈ ఎపిసోడ్‌‌లో ఎన్టీఆర్ నాలుగు గంటలపాటు ఏకధాటిగా షోలో సందడి చేస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్‌కి స్పెషల్ గెస్ట్‌గా ప్రిన్స్ మహేష్ బాబు వస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయన నటిస్తున్న ‘స్పైడర్’ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండంతో అటు ప్రమోషన్స్‌గా కూడా మహేష్ ప్లస్ అవుతుందని అందరూ భావించారు. అయితే మహేష్ బిజీ షెడ్యూల్ కారణంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు రావడం లేదని తెలుస్తోంది.

THIS SUNDAY will be the BIGGEST!!! 😉 #BIGGBOSSTELUGU GRAND FINALE..Tomorrow at 6 PM on @StarMaa​ #OPPOBiggBoss @oppomobileindia pic.twitter.com/wyuKPTTxBt — STAR MAA (@StarMaa) September 23, 2017
అయితే బిగ్‌బాస్ సీజన్ 1 గ్రాండ్ ఫిలాలే స్పెషల్ ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ అలరించిన కింగ్ నాగార్జున బిగ్‌బాస్ విన్నర్‌ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తోనూ, మా యాజమాన్యంతోనూ నాగార్జునకు సాన్నిహిత్యం ఉంది. దీంతో ఎన్టీఆర్‌తో కలిసి స్టేజ్‌ని షేర్ చేసుకోనున్నారు నాగార్జున. మరోవైపు నాగార్జున బిగ్‌బాస్ షో ప్రారంభంలోనూ బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్‌ని ఆకాశానికెత్తేస్తూ.. ఎన్టీఆర్ ఎనర్జీ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశాడు. తొలి వారంలో అద్భుత మైన ఓపినింగ్స్ సాధించినందుకు అప్పట్లో అభినందనలు తెలియజేశారు నాగార్జున. దీనిపై స్పందించిన ఎన్టీఆర్.. మీరు చూపించిన మార్గంలోనే నేను నడుస్తున్నా.. థాంక్స్ బాబాయ్ అంటూ రీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే నాగార్జున ప్రస్తుతం నాగచైతన్య-సమంత పెళ్లి పనుల్లో బిజీ ఉండటంతో ‘ఈ కోటీశ్వరుడు ఆ 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలిపొందే లక్షాధికారిని అనౌన్స్ చేసేందుకు వస్తారా? అన్నది సందేహంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.