యాప్నగరం

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: నమ్రతా శిరోద్కర్‌పై నేషనల్ మీడియా కథనాలు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమ్రతా శిరోద్కర్‌ పేరు బయటికి వచ్చింది. ఎన్జీబీ అధికారుల విచారణలో పాల్గొన్న టాలెంట్ మేనేజర్ జయ సాహా ఆమె పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 22 Sep 2020, 5:34 pm
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరు బయటికి రావడం సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని జాతీయ న్యూస్ చానళ్లు నమ్రతా పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. టాలెంట్ మేనేజర్ జయా సాహాతో ఆమె వాట్సాప్‌లో ఛాటింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ సుమిత్ కడేల్ సైతం ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఆజ్ తక్ చానెల్ ఈ మేరకు కథనాన్ని ప్రసారం చేసినట్టు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu నమ్రతా శిరోద్కర్

‘బాంబేలో మంచి ‘ఎండీ’ ఇస్తానని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత చాటింగ్‌ చేసినట్లు నేషనల్‌ మీడియా చెబుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జయ సాహాను విచారించారు. ఈ సందర్భంగా నమ్రతకు తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌‌ప్రీత్ సింగ్ పేరు బయటికి రావడంతో టాలీవుడ్ షాకైన సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ సతీమణి నమ్రత పేరు వెలుగులోకి రావడంతో మరింత కలకలం రేపుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.