యాప్నగరం

‘పంచెకట్టు’ పండగలో నందమూరి ఫ్యామిలీ

నందమూరి కుటుంబం కాకినాడలో పంచెకట్టు పండగ చేసుకుంది.

Samayam Telugu 24 Dec 2016, 12:25 pm
నందమూరి కుటుంబం కాకినాడలో పంచెకట్టు పండగ చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగిలో ఈ పండుగ జరిగింది. ఈ పండుగకు నందమూరి హరికృష్ణ, ఆయన తనయులు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు తరలివచ్చారు.
Samayam Telugu nandamoori familys panche kattu function in kakinada
‘పంచెకట్టు’ పండగలో నందమూరి ఫ్యామిలీ


హరికృష్ణ తనయుడు దివంగత జానకీరామ్ కుమారులు తారకరామారావు (13), సౌమిత్రి ప్రభాకర్ రావు (11)లకు పంచెకట్టు ఫంక్షన్ నిర్వహించేందుకు నందమూరి ఫ్యామిలీ ఇక్కడికి తరలివచ్చింది. వేళంగి...జానకీరామ్ అత్తగారు ఊరు. ఈ ఫంక్షన్ కోసం జానకీరామ్ తనయులు తారకరామారావు, ప్రభాకర్ రావులు ఇక్కడే ఉన్నారు.

ఈ పండగలో పాల్గొనేందుకు వచ్చిన తాతయ్య హరికృష్ణ, బాబయ్‌లు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్‌లను చూసి పిల్లలు పరుగెత్తికెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దీంతో అక్కడున్నన వారందరి కళ్లు చెమ్మగెల్లాయి. పెద్దలు చిన్నారులకు పట్టుబట్టలు అందజేసి ఆశీర్వాదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.