యాప్నగరం

స్కాచ్ బాటిల్ పంపి నంది అవార్డు అడిగారట!

తమకు లభించే కన్వెనియన్స్‌లు, అందే టిఫిన్, చాయ్, బిస్కెట్లపైనే జ్యూరీ సభ్యులు తొలి సమావేశంలోనే మాట్లాడుకోవడంతో తాను అవాక్కయ్యానని, 2013 నంది అవార్డుల కమిటీ సభ్యుడు సత్య వ్యాఖ్యానించారు.

TNN 19 Nov 2017, 2:09 pm
తమకు లభించే కన్వెనియన్స్‌లు, అందే టిఫిన్, చాయ్, బిస్కెట్లపైనే జ్యూరీ సభ్యులు తొలి సమావేశంలోనే మాట్లాడుకోవడంతో తాను అవాక్కయ్యానని, 2013 నంది అవార్డుల కమిటీ సభ్యుడు సత్య వ్యాఖ్యానించారు. నంది అవార్డుల వివాదంపై ఓ చానల్ నిర్వహించన లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పెద్దమనిషి తనకు ఫోన్ చేసి, మిగతా అందరినీ మేనేజ్ చేశాను తన సినిమాకు అవార్డు ప్రకటించేందుకు సహకరించాలని కోరితే, మరో ప్రముఖ వ్యక్తి ఏకంగా ఓ పార్సిల్ పంపారని తెలియజేశారు. అందులో స్కాచ్ బాటిల్ పంపి నంది అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేశారని వివరించారు.
Samayam Telugu nandi awards row 2013 jury member intresting comments about awards
స్కాచ్ బాటిల్ పంపి నంది అవార్డు అడిగారట!


ఏంటండీ స్కాచ్ బాటిల్ పంపారని సదరు వ్యక్తిని అడిగితే, మిగతా వారంతా ఒప్పుకున్నారని, తన సినిమాకు అవార్డు వచ్చేలా చూడాలని ఆయన కోరారని అన్నారు. ఆ రోజు నుంచి తాను ఒక్క కమిటీ సమావేశానికి కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. సినిమాలు చూడకుండానే అవార్డుల జాబితా తయారు చేసినట్టు అనుమానం వస్తోందని అన్నారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్‌తో పాటు, ప్రభుత్వ ఉద్యోగులను, సంఘంలోని ఇతర వర్గాల ప్రముఖులను కూడా కమిటీలో భాగం చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని సత్య వెలిబుచ్చారు.

అలాగే ఒకేసారి మూడు సంవత్సరాల అవార్డులను ప్రకటించడంతోనే ప్రస్తుతం నంది అవార్డులపై వివాదం చెలరేగుతోందని, కళాత్మక చిత్రాలకు అవార్డులను మరచి, కమర్షియల్ వైపు ఎన్నడో అడుగులు పడ్డాయని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, 2011 నంది అవార్డుల కమిటీ మెంబర్, గతంలో నంది అవార్డును గెలుచుకున్న మోహన్ గోటేటి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.