యాప్నగరం

‘నవాబ్’ దర్శకుడు మణిరత్నంకు బెదిరింపులు

అప్పట్లో ‘బొంబాయి’ సినిమాతో బెదిరింపులు ఎదుర్కొన్న మణిరత్నంకు.. తాజాగా విడుదలైన ‘నవాబ్’ సినిమాతోనూ అలాంటి బెదిరింపులే ఎదురవ్వుతున్నాయి.

Samayam Telugu 3 Oct 2018, 12:24 pm
‘నవాబ్’ సినిమాతో మరోసారి తన ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు మణరత్నంకు బెదిరింపులు వస్తున్నాయి. ‘నవాబ్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించనట్లయితే ఆయన ఇంటిని బాంబులతో పేల్చేస్తానని ఓ గుర్తుతెలియని వ్యక్తి మణిరత్నం ఆఫీసుకు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో మణిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu Untitled1


కేసు నమోదు చేసుకున్న చెన్నైలోని అభిరామపురం పోలీసులు అల్వర్‌పేటలో గల మణిరత్నం ఇంటిని బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. ఇంటి లోపల బయట సోదాలు చేశారు. అనంతరం మణిరత్నం ఆఫీసులో కూడా సోదాలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మణిరత్నం ఆఫీసుకు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు చేశారానే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి జయసుధ ప్రధాన తారాగణంగా తమిళంలో ‘చిక్కా చివంత వానం’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘నవాబ్’గా విడుదలైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.