యాప్నగరం

2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్

సాధారణంగా సినిమాలకి రూ. 4 కోట్ల పారితోషికం తీసుకునే ఈ హీరోయిన్ తాజాగా ఓ టీవీ యాడ్ చేయడానికి ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్...

TNN 1 Aug 2017, 6:55 pm
టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా సమానమైన డిమాండ్ వున్న హీరోయిన్ నయనతార. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఎవరికైనా సూట్ అయ్యే హీరోయిన్ కావడంతో నయనతారకి హిట్స్‌తో ఫట్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ కొనసాగుతోంది. సాధారణంగా సినిమాలకి రూ. 4 కోట్ల పారితోషికం తీసుకునే ఈ హీరోయిన్ తాజాగా ఓ టీవీ యాడ్ చేయడానికి ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేయడం ప్రస్తుతం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అమ్మడికి వున్న డిమాండ్ అటువంటిది కావడంతో ఆ వాణిజ్య సంస్థ కూడా ఆమె అడిగినంత ఇచ్చిందని కోలీవుడ్ టాక్.
Samayam Telugu nayanthara charging rs 5 crores for two days
2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్


అయితే, ఇంతా చేసి ఆ టీవీ యాడ్ షూట్ చేయడానికి ఆమెకి పట్టిన సమయం ఎంతో కాదు.. జస్ట్ రెండంటే రెండే రోజుల్లో యాడ్ షూటింగ్ ముగించిందట. కేవలం రెండు రోజుల షూటింగ్‌కి డేట్స్ ఇచ్చిన నయనతార ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేయడం చూసి కోలీవుడ్ అవాక్కవుతోంది. ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి ఇంకా వెల్లడి కాలేదు.

ఇక నయనతార సినిమా ప్రాజెక్ట్స్ విషయానికొస్తే, ఆమె ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తుండగా తెలుగులో త్వరలోనే బాలయ్య బాబు సరసన ఓ సినిమాలో నటించనుంది. బాలకృష్ణ సరసన సింహ, శ్రీరామరాజ్యం తర్వాత నయన్ చేయనున్న సినిమా ఇది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.