యాప్నగరం

‘ఖయ్యూం భాయ్’గా వస్తున్న నయీం!

పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు

Samayam Telugu 18 Jan 2017, 9:38 am
పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ..ప్రకటించారు. నయీం పేరుతో మూడు సీక్వెల్స్ కూడా తీస్తానని అన్నారు. కానీ..అది ఇంత వరకు పట్టాలపైకి ఎక్కలేదు.
Samayam Telugu nayeem is back as kayyum bai in a telugu movie
‘ఖయ్యూం భాయ్’గా వస్తున్న నయీం!


అలాంటిది దర్శకుడు భరత్...‘ఖయ్యూం భాయ్’పేరుతో నయీం జీవితం ఆధారంగా సినిమా తీసేశారు. సినిమా ఎప్పుడు ప్రారంభమైందన్న ఆలోచనే లేకుండా దాదాపు 90శాతం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.
ఈ చిత్రంలో నయీమ్ గా కట్టా రాంబాబు నటిస్తుండగా ఏసీపీ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు భరత్ చెప్పారు.


ప్రధాన పాత్రదారుడు కట్టా రాంబాబు స్టిల్స్ అచ్చం గ్యాంగ్ స్టర్ నయీం పోలి ఉండటం చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.