యాప్నగరం

Nandamuri Balakrishan: బాలకృష్ణ జోరు.. NBK 108లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన నందమూరి హీరో

NBK 108 మూవీ షూటింగ్ డిసెంబర్ 8న ప్రారంభమైంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు. అనంతపురంకు చెందిన అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ను అనీల్ రావిపూడి ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు NBK 108 సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి తెలియజేశారు. 2022 ముగిసిన రోజునే బాలయ్య మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు తెలిపారాయన.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 31 Dec 2022, 10:07 pm
నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనీల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార‌పాటి హ‌రీష్ పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ‌ను ఓ డిఫ‌రెంట్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తూ ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబ‌ర్ 8న షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అనీల్ రావిపూడి ప్లానింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.
Samayam Telugu NBK 108 Shooting
NBK 108 shooting


ప్లానింగ్ ప్రకారం అనీల్ రావిపూడి NBK 108 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ ఫైట్‌ను చిత్రీకరించినట్లు అనీల్ రావిపూడి (Anil Ravipudi) తెలిపారు. అనుకున్న ప్లానింగ్ ప్రకారం తొలి షెడ్యూల్‌ను 2022 చివరి రోజున పూర్తి చేయటంపై ఎంటైర్ టీమ్ హ్యాపీగా ఫీలైంది. బాలకృష్ణ, నిర్మాతలు, దర్శకుడు అనీల్ రావిపూడి అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇదే స్పీడుతో వెళితే NBK 108 సినిమాను ఈ ఏడాది మే నాటికంతా విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన టాక్సీవాలా (Taxiwala), ఎస్.ఆర్.కళ్యాణ మండపం (SR Kalyana mandapam) హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) హీరోయిన్‌గా నటించనుంది. శ్రీలీల బాలయ్య కుమార్తెగా కనిపిస్తుందని అంటున్నారు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 107వ (NBK 107) సినిమా వీర సింహా రెడ్డి (Veera simha reddy)షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి (Sankranthi 2023) సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌బోతున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని (Gopichand Malineni) దర్శ‌కుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.