నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా నటిస్తున్న ‘జై సింహా’ మూవీ సంక్రాంతి కానుకగా 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ తేదీ కోసం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ తదనంతర కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ‘జై సింహా’ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో అభిమానులు, సినీ ప్రముఖల మధ్య వైభవంగా ప్రారంభమైంది.
#Balakrishna Dynamic Entry at #JaiSimha Pre Release Function#JaiSimhaOnJan12 #NBK102 pic.twitter.com/n7YSZyqmSV — CK Entertainments (@CKEntsOffl) January 8, 2018
ఈ కార్యక్రమానికి హీరో బాలయ్య స్పెషల్ అట్రాక్షన్గా నిలవగా.. బోయపాటి శ్రీను, వివి వినాయక్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ‘జై సింహా’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్.. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్యకు జోడిగా అందాల నటి నయనతార నటిస్తుండగా.. హరిప్రియ సెకండ్ హీరోయిన్గా సందడి చేయనుంది. ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని సమాకూర్చుతున్నారు.
#Balakrishna Dynamic Entry at #JaiSimha Pre Release Function#JaiSimhaOnJan12 #NBK102 pic.twitter.com/n7YSZyqmSV — CK Entertainments (@CKEntsOffl) January 8, 2018
ఈ కార్యక్రమానికి హీరో బాలయ్య స్పెషల్ అట్రాక్షన్గా నిలవగా.. బోయపాటి శ్రీను, వివి వినాయక్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ‘జై సింహా’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్.. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్యకు జోడిగా అందాల నటి నయనతార నటిస్తుండగా.. హరిప్రియ సెకండ్ హీరోయిన్గా సందడి చేయనుంది. ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని సమాకూర్చుతున్నారు.