ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతోన్న వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్లపై ఇష్టమొచ్చినట్టు వాహనాలను నడిపే వారి వీపులు వాయగొట్టేలా జరిమానాలను భారీగా పెంచింది. ఈ మేరకు మోటార్ వాహన చట్టాన్ని సవరించి కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు కిందటి నెలలో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ నుంచి ఈ కొత్త మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చింది.
ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వాహనదారులు చలాన్లకు బలైపోతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా భారీగా చలాన్లు కడుతున్నారు. రెడ్ సిగ్నల్ను దాటి వెళ్లిపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వంటి ట్రాఫిక్ వయోలేషన్ చేస్తే రూ.5వేల వరకు జరిమానా విధిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయలు చలాన్ కట్టాల్సిందే. ఈ నిబంధనలపై ఇప్పుడు చర్చ మొదలైంది. కొంత మంది సోషల్ మీడియాలో చర్చను లేవదీశారు.
Also Read: ‘క్వీన్’గా జయలలిత బయోపిక్.. టైటిల్ రోల్లో రమ్యకృష్ణ
కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టాన్ని సవరించడానికి మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’కి ముడిపెడుతున్నారు. మహేష్ సినిమా వల్లే కేంద్ర ప్రభుత్వం చలాన్ రేట్లను భారీగా పెంచేసిందని ఆరోపిస్తున్నారు. గుర్గావ్లో రెడ్ సిగ్నల్ను జంప్ చేసినందుకుగాను ఒక రిక్షా డ్రైవర్కు రూ. 32,500 జరిమానా విధించారు. దీంతో ఈ రచ్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం మరీ ఘోరంగా జరిమానాలు విధిస్తోందని కొంత మంది ఫైర్ అవుతున్నారు.
ప్రధాని మోదీ అండ్ టీం ‘భరత్ అనే నేను’ సినిమా చూసి ఉంటారని, అందుకే ఇంత ఘోరంగా పెనాల్టీ రేట్లు పెంచేశారని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, మరికొందరు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటిస్తే చలానాలు కట్టే అవసరం ఉండదు కదా అని సలహా ఇస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్, చలాన్ల గురించి తెలుసుకోవాలంటే ‘భరత్ అనే నేను’ సినిమా చూడండని మరికొందరు సలహాలిస్తున్నారు. మొత్తం మీద మరోసారి ‘భరత్ అనే నేను’ సినిమాను బాగా వైరల్ చేస్తున్నారు.
ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వాహనదారులు చలాన్లకు బలైపోతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా భారీగా చలాన్లు కడుతున్నారు. రెడ్ సిగ్నల్ను దాటి వెళ్లిపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వంటి ట్రాఫిక్ వయోలేషన్ చేస్తే రూ.5వేల వరకు జరిమానా విధిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయలు చలాన్ కట్టాల్సిందే. ఈ నిబంధనలపై ఇప్పుడు చర్చ మొదలైంది. కొంత మంది సోషల్ మీడియాలో చర్చను లేవదీశారు.
Also Read: ‘క్వీన్’గా జయలలిత బయోపిక్.. టైటిల్ రోల్లో రమ్యకృష్ణ
కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టాన్ని సవరించడానికి మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’కి ముడిపెడుతున్నారు. మహేష్ సినిమా వల్లే కేంద్ర ప్రభుత్వం చలాన్ రేట్లను భారీగా పెంచేసిందని ఆరోపిస్తున్నారు. గుర్గావ్లో రెడ్ సిగ్నల్ను జంప్ చేసినందుకుగాను ఒక రిక్షా డ్రైవర్కు రూ. 32,500 జరిమానా విధించారు. దీంతో ఈ రచ్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం మరీ ఘోరంగా జరిమానాలు విధిస్తోందని కొంత మంది ఫైర్ అవుతున్నారు.
ప్రధాని మోదీ అండ్ టీం ‘భరత్ అనే నేను’ సినిమా చూసి ఉంటారని, అందుకే ఇంత ఘోరంగా పెనాల్టీ రేట్లు పెంచేశారని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, మరికొందరు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటిస్తే చలానాలు కట్టే అవసరం ఉండదు కదా అని సలహా ఇస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్, చలాన్ల గురించి తెలుసుకోవాలంటే ‘భరత్ అనే నేను’ సినిమా చూడండని మరికొందరు సలహాలిస్తున్నారు. మొత్తం మీద మరోసారి ‘భరత్ అనే నేను’ సినిమాను బాగా వైరల్ చేస్తున్నారు.