యాప్నగరం

Mahesh Babu: `సరిలేరు నీకెవ్వరు`లో కొత్త సీన్స్‌.. వసూళ్ల కోసమేనా!

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘనవిజయం సాధించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పుడు మరింత కామెడీని జోడించేందుకు రెడీ అవుతున్నారట చిత్రయూనిట్‌. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.

Samayam Telugu 22 Jan 2020, 8:45 pm
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘనవిజయం సాధించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పుడు మరింత కామెడీని జోడించేందుకు రెడీ అవుతున్నారట చిత్రయూనిట్‌. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.
Samayam Telugu new scenes adding in mahesh babus sarileru neekevvaru
Mahesh Babu: `సరిలేరు నీకెవ్వరు`లో కొత్త సీన్స్‌.. వసూళ్ల కోసమేనా!


సంక్రాంతి బరిలో సూపర్‌ హిట్

సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు తొలి షో నుంచే బ్లాక్‌ బస్టర్ టాక్‌ వచ్చింది. సినిమా రిలీజ్ ముందే హిట్‌ కొడుతున్నాం అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పిన చిత్రయూనిట్ మాట నిలబెట్టుకున్నారు. దిల్‌ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఆకట్టుకున్న కామెడీ టైమింగ్‌

ఇటీవల ఎక్కువగా సీరియస్‌, సందేశాత్మక చిత్రాలు మాత్రమే చేసిన మహేష్‌, ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించాడు. మాస్‌ యాక్షన్‌తో పాటు కామెడీ పంచ్‌లతోనూ ఆకట్టుకున్నాడు. సూపర్‌ స్టార్‌ కామెడీ టైమింగ్‌కు యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా బాగా కనెక్ట్ అవ్వటంతో సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.

వసూళ్లు మరింత పెంచే ప్లాన్‌

అయితే ఆ వసూళ్లను మరింత పెంచే ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ఈ శుక్రవారం నుంచి సినిమాలో మరికొన్ని సీన్స్‌ యాడ్‌ చేస్తున్నట్టుగా దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు. మరికొన్ని నవ్వులు మీ కోసం అంటూ ప్రేక్షకులను ఊరిస్తున్నాడు. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమాకు కొత్త సీన్స్‌ యాడ్ చేయటం ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Youtube-Anil Ravipudi about New Scenes adding in Sarileru Neekevvaru Movie | Dil Raju, Mahesh Babu| Rashmika

అల వైకుంఠపురములోతో భారీ పోటి

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ వచ్చినా.. అదే టైంలో ఒక్క రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురములో కలెక్షన్లతో వెనకపడింది. పది రోజుల్లు సరిలేరు 200 కోట్ల గ్రాస్ సాధిస్తే అల వైకుంఠపురములో 220 కోట్ల గ్రాస్‌ సాదించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాకు కొత్త సన్నివేశాలు యాడ్‌ చేస్తుండటంతో కలెక్షన్లు మరోసారి ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.