వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘శంకరాభరణం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ను సొంతం చేసుకున్నాడు. నిఖిల్ హీరోగా ఇటీవల వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ కూడా మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా నిఖిల్ మరో సినిమాతో బిజీగా ఉన్నారు. టి.యన్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్నారు. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్లపై కార్య వేణుగోపాల్, రాజ్కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ప్రస్తుతం ఆమె కూడా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిపింది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. వాస్తవానికి తమిళ చిత్రం ‘కనితన్’కు ఇది రీమేక్. తెలుగులో ‘ముద్ర’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తమిళంలో హీరోయిన్గా చేసిన కేథరిన్ను తెలుగులో కూడా తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆమె అంత ఆసక్తి చూపలేదట. దీంతో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు.
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్యా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం టి.యన్.సంతోష్. తమిళ ‘కనితన్’ సినిమాకు కూడా ఈయనే దర్శకుడు.
అయితే ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ప్రస్తుతం ఆమె కూడా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిపింది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. వాస్తవానికి తమిళ చిత్రం ‘కనితన్’కు ఇది రీమేక్. తెలుగులో ‘ముద్ర’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తమిళంలో హీరోయిన్గా చేసిన కేథరిన్ను తెలుగులో కూడా తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆమె అంత ఆసక్తి చూపలేదట. దీంతో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు.
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్యా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం టి.యన్.సంతోష్. తమిళ ‘కనితన్’ సినిమాకు కూడా ఈయనే దర్శకుడు.