యాప్నగరం

18 Pages: అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. ‘కార్తికేయ 2’ సక్సెస్‌ను మార్కెట్ చేసుకునే పనిలో నిర్మాతలు

Nikhil Siddhartha - Anupama Parameswaran: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘18 పేజీస్’. డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. అయితే కార్తికేయ 2 తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంపై సినీ సర్కిల్స్‌లో అల్లు అరవింద్ మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుతం అంటూ టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై రూపొందుతోన్న 18 పేజీస్ చిత్రం కథను సుకుమార్ (Sukumar) అందించిన సంగతి తెలిసిందే.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 27 Oct 2022, 10:33 am
ఓ వస్తువును తయారు చేయటమే కాదు.. దాన్నెంత తెలివిగా బిజినెస్ చేసుకోవాలో తెలుసుండాలి. టాలీవుడ్‌లో అలాంటి బిజినెస్ స్ట్రాటజీలతో అగ్ర నిర్మాతగా ఎదిగిన వ్యక్తి అల్లు అరవింద్ (Allu Aravind). ఈ స్టార్ ప్రొడ్యూసర్ రీసెంట్‌గా కాంతార (Kantara) సక్సెస్‌తో తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మరో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అసలేంటా ప్లాన్? అనే వివరాల్లోకి వెళితే, నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘18 పేజీస్’ (18 Pages). ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది.
Samayam Telugu 18 Pages
18 పేజీస్


నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే తప్పేంటి అనే సందేహం రాక మానదు. కానీ అసలు విషయమేమంటే రీసెంట్‌గానే ఆయన హీరోగా నటించిన కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సక్సెస్‌ అనేది నిఖిల్ నెక్ట్స్ మూవీస్‌పై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ 2 నుంచి 18 పేజీస్ చిత్రాన్ని రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో పావులు కదిపి ఈ చిత్రాన్ని జీఏ2 టీమ్ రెడీ చేస్తోంది. సినీ సర్కిల్స్‌లో మాత్రం అల్లు అరవిండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుతం అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు మరి.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై రూపొందుతోన్న 18 పేజీస్ చిత్రం కథను సుకుమార్ (Sukumar) అందించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. మరియు 18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎ.వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి గోపీ సుందర్ (Gopi Sundar) సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.