Nikhil Siddhartha’s Arjun Suravaram Collects Rs 4 Crore Gross World Wide In First Day
‘అర్జున్ సురవరం’ ఫస్ట్ డే కలెక్షన్.. నిఖిల్ గట్టిగా కొట్టాడు!
నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. తమిళ చిత్రం ‘కనితన్’కు ఇది రీమేక్. అయితే, తెలుగులో చాలా మార్పులే చేశారు. తమిళంలో దర్శకత్వం వహించిన టి. సంతోష్ తెలుగులోనూ డైరెక్ట్ చేశారు. బి. మధు సమర్పణలో ఏ మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి ప్రొడక్షన్ బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Samayam Telugu30 Nov 2019, 5:48 pm
నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. తమిళ చిత్రం ‘కనితన్’కు ఇది రీమేక్. అయితే, తెలుగులో చాలా మార్పులే చేశారు. తమిళంలో దర్శకత్వం వహించిన టి. సంతోష్ తెలుగులోనూ డైరెక్ట్ చేశారు. బి. మధు సమర్పణలో ఏ మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి ప్రొడక్షన్ బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలకు ముందు మంచి హైప్
వాస్తవానికి ‘అర్జున్ సురవరం’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఐదారు నెలలు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ఈనెల 29న విడుదలైంది. సినిమా ఇన్ని నెలలు వాయిదా పడటంతో నిజానికి చిత్ర యూనిట్ భయపడింది. జనం ఈ సినిమాను మరిచిపోయి ఉంటారని అనుకుంది. కానీ, విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి కారణం చిత్ర యూనిట్ చేసిన భారీ ప్రచారం. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం బాగా కలిసొచ్చింది.
తొలిరోజు రూ.4.1 కోట్లు
మంచి అంచనాల నడుమ విడుదలైన ‘అర్జున్ సురవరం’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.4.1 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన సినిమాను ఇంతలా ఆదరిస్తోన్న తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘ఇచ్చేశారుగా’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Twitter-Thanks to The TELUGU MOVIE LOVING AUDIENCE 🙏🏽 ...
కనెక్ట్ అయిన పాయింట్
సినిమాలో మంచి స్టఫ్ ఉందని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెబుతోంది. ఇంత మంచి సినిమా అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోవడంతో ఒకానొక దశలో హీరో నిఖిల్ కూడా అసహనానికి, బాధకు గురయ్యారు. కానీ, ఇప్పుడు సినిమా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతుంటే ఎంతో ఆనందిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చడానికి కారణం ఇది సోషల్ మెసేజ్తో కూడిన సినిమా కావడం.
ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న అక్రమాలను ప్రస్తావిస్తూ సినిమా తీస్తే కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కాకపోతే, ఆ మెసేజ్ ఎంటర్టైనింగ్గా ఉండాలి. ఈ విషయంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం అనే పాయింట్కు కమర్షియల్ ఎలిమెంట్స్ను జతచేసి ఒక మంచి థ్రిల్లర్గా తెరకెక్కించారు దర్శకుడు. ఈ అంశాలే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోన్న ‘అర్జున్ సురవరం’ బాక్సాఫీసు వద్ద ఎంత మేర రాబడుతుందో చూడాలి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.