యాప్నగరం

సినిమా చేసే ఆలోచన లేదు.. ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్

రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి పెడతానని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. కరీంనగర్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

TNN 22 Jan 2018, 9:22 pm
రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి పెడతానని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయం. ఎవరి మద్దతూ లేదు. నా వంతు కృషి చేసుకుంటూ ముందుకుపోతా’ అని పవన్ తెలిపారు. సోమవారం (జనవరి 22) కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానంతరం కరీంనగర్‌ చేరుకున్న పవన్.. విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
Samayam Telugu no more movies at present pawan kalyan says in press meet
సినిమా చేసే ఆలోచన లేదు.. ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్


రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని, ఎన్ని స్థానాల్లో బలం ఉందో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ తెలిపారు. పర్యటన పూర్తి చేసి వచ్చిన తర్వాత కార్యకర్తల సూచనల మేరకు ఎక్కడ బలం ఉందో పరిశీలించి, దాన్ని బట్టి ముందుకుకెళతానని ఆయన చెప్పారు.

సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి, రాజకీయాల్లోనే ఉంటారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ‘అవును. ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతా’ అని అన్నారు.

‘చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మరి భవిష్యత్‌లో జనసేనను ఎందులోనైనా విలీనం చేస్తారా?’ అనే ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ‘గతంలో ఇదే ప్రశ్న అమిత్‌షా కూడా అడిగారు. ఎందుకు మీకు ఇవన్నీ.. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్‌ ఉండదు.. బీజేపీలోకి వచ్చేయండి అని ప్రతిపాదించగా.. దాన్ని సున్నితంగా తిరస్కరించా’ అని చెప్పారు.

‘ఓటుకు నోటు’ అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఓటుకు నోటు అంశం బయటకు వచ్చినప్పుడు షాక్‌కు గురయ్యా. అది తప్పని తెలుసు. ఓ రాజకీయ పార్టీలో అస్థిరతను కలిగించే పని చేయకూడదనే ఉద్దేశంతోనే ఆ అంశంపై స్పందించలేదు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.