సామాజిక మాధ్యమాలు, టీవీలు, రేడియోలు, పత్రికలు.... ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కోసం ఊదరగొడుతుంటే, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం... ఇవన్నీ ఎందుకు అని ప్రశ్నిస్తోంది. ‘‘మహిళా శక్తి, సాధికారత... ఈ రోజే గుర్తొస్తాయా? మహిళలూ మామూలు మనుషులే, పురుషులతో సమానంగా రాణిస్తారు. కేవలం ఒక్కరోజులో మహిళలను ఆకాశాన్ని ఎత్తి... తర్వాత రోజుల్లో బానిసల్లా చూడటమేనా దీని ఉద్దేశం?’’ అంటూ 5 నిమిషాల నిడివితో వీడియో సందేశం విడుదల చేసింది.
‘‘ఏటా మార్చి 8న ఇదే హడావిడి, ఆ తర్వాత అంతా మామూలే. సంవత్సరాలు వస్తున్నాయ్, పోతున్నాయ్. కానీ, మహిళలపై వేధింపులు తగ్గుతున్నాయా? మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయా? ఇంకా బలహీనులుగా చూస్తున్నారే గానీ... అందరితో సమానంగా ఎందుకు చూడటం లేదు? ఆడపిల్లను ఆట బొమ్మలా ఎందుకు చూస్తున్నారు? తన ప్రాణాలను ఫణంగా పెట్టి... మానవ జాతికి ప్రాణం పోస్తున్న ‘మాతృ’జాతిని ఈ ఒక్కరోజూ గౌరవిస్తే సరిపోతుందా? ఆలోచించండి... ఈ మహిళా దినోత్సవం అవసరమా?’’ అంటూ రకుల్ ఏకిపారేసింది. ఆ వీడియో మీరూ చూడండి...
‘‘ఏటా మార్చి 8న ఇదే హడావిడి, ఆ తర్వాత అంతా మామూలే. సంవత్సరాలు వస్తున్నాయ్, పోతున్నాయ్. కానీ, మహిళలపై వేధింపులు తగ్గుతున్నాయా? మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయా? ఇంకా బలహీనులుగా చూస్తున్నారే గానీ... అందరితో సమానంగా ఎందుకు చూడటం లేదు? ఆడపిల్లను ఆట బొమ్మలా ఎందుకు చూస్తున్నారు? తన ప్రాణాలను ఫణంగా పెట్టి... మానవ జాతికి ప్రాణం పోస్తున్న ‘మాతృ’జాతిని ఈ ఒక్కరోజూ గౌరవిస్తే సరిపోతుందా? ఆలోచించండి... ఈ మహిళా దినోత్సవం అవసరమా?’’ అంటూ రకుల్ ఏకిపారేసింది. ఆ వీడియో మీరూ చూడండి...