యాప్నగరం

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య కన్నుమూత

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ మృతి చెందారు. ఆమె వయసు 53 ఏళ్లు.

Samayam Telugu 6 Nov 2020, 6:56 pm
ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య అంజు ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంజు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 53 ఏళ్లు. ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Samayam Telugu అంజు, పి.డి.వి. ప్రసాద్
PDV Prasad Wife Died


పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించే చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారనే విషయం విదితమే. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’, ‘జెర్సీ’, ‘అ ఆ’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. కాగా, అంజు ప్రసాద్ అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లో జరుగనున్నాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.