NTR ఈజ్ బ్యాక్.. ఇక కొరటాల శివ సినిమా షూటింగ్ షురూ!
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సెర్మనీ కోసం అమెరికా వెళ్లిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హైదరాబాద్ చేరుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. హాలీడే ట్రిప్ ముగియడంతో ఇక 'ఎన్టీఆర్ 30' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి నుంచి డైరెక్టర్ కొరటాల శివ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. దీంతో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. ట్విట్టర్లో 'NTR30' హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత నెల రోజులుగా కుటుంబ సమేతంగా అమెరికాలో విహారయాత్ర చేస్తున్నాడు. తన తదుపరి చిత్రం షూటింగ్ ఎలాగో ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ తన కుటుంబంతో గడపాలని డిసెంబర్లో యుఎస్ఎ వెళ్లాడు. ఇటీవల అమెరికాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ రావడంతో చిత్రబృందంతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
రిటర్న్
కార్యక్రమాలన్నీ ముగియడంతో తన కుటుంబంతో కలిసి ఈరోజు ఉదయం USA వెకేషన్ నుంచి ఎన్టీఆర్ తిరిగి వచ్చాడు. ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతిని జరుపుకోనున్నాడు.
షురూ
ఫిబ్రవరి నుంచి కొరటాల శివ డైరెక్షన్లోని యాక్షన్ ఎంటర్టైనర్ షూట్ ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని 2024 వేసవికి విడుదల చేయాలని చూస్తున్నారు. కొరటాల శివ సినిమా షూటింగ్ను ప్రారంభించే ముందు ఎన్టీఆర్ ఈ నెలలో తన లుక్స్పై దృష్టి పెట్టనున్నాడు. ఈ ప్యాన్-ఇండియన్ యాక్షన్లో ఎన్టీఆర్తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఆచార్య లాంటి పరాజయం తర్వాత కొరటాల శివకి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. దీంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కొరటాల శివ భావిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో ప్యాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఎన్టీఆర్ కసి మీద ఉన్నాడు.
రిటర్న్
కార్యక్రమాలన్నీ ముగియడంతో తన కుటుంబంతో కలిసి ఈరోజు ఉదయం USA వెకేషన్ నుంచి ఎన్టీఆర్ తిరిగి వచ్చాడు. ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతిని జరుపుకోనున్నాడు.
షురూ
ఫిబ్రవరి నుంచి కొరటాల శివ డైరెక్షన్లోని యాక్షన్ ఎంటర్టైనర్ షూట్ ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని 2024 వేసవికి విడుదల చేయాలని చూస్తున్నారు. కొరటాల శివ సినిమా షూటింగ్ను ప్రారంభించే ముందు ఎన్టీఆర్ ఈ నెలలో తన లుక్స్పై దృష్టి పెట్టనున్నాడు. ఈ ప్యాన్-ఇండియన్ యాక్షన్లో ఎన్టీఆర్తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఆచార్య లాంటి పరాజయం తర్వాత కొరటాల శివకి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. దీంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కొరటాల శివ భావిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో ప్యాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఎన్టీఆర్ కసి మీద ఉన్నాడు.
- Read Tollywood Updates & Telugu News