‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న డైరెక్టర్ వీఐ ఆనంద్. ఈ సినిమాతో ఆనంద్పై ప్రశంసల వర్షం కురిసింది. తన తొలి సినిమాలానే రెండో చిత్రానికి కూడా ఆసక్తికరమైన కథను ఎంచుకున్నారు ఆనంద్. ఈ ప్రపంచంలో ఓ ఇద్దరు వ్యక్తుల జీవితాలు సమాంతరంగా ఉండే అవకాశం ఉందని, అందులో ఒకరి గతం మరొకరి భవిష్యత్తు కావచ్చనే కాన్సెప్ట్తో ‘ఒక్క క్షణం’ అనే సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి కోసం చావడానికికైనా సిద్ధపడే కుర్రాడి పాత్రలో శిరీష్ కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. సినిమా టీజర్ను అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు.
Presenting the teaser of Okka Kshanam. Wondering if you also might be having a "parallel life" with someone? #OkkaKshanam https://t.co/SlpFoZtPnj — Allu Sirish (@AlluSirish) December 3, 2017
టీజర్తో సినిమాపై అంచనాలు పెంచేశారు డైరెక్టర్ ఆనంద్. టీజర్ చాలా ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. లవ్ వర్సస్ డెస్టినీ.. ఇదే సినిమాలో ప్రధాన అంశం. సినిమా సబ్ టైటిల్ కూడా ఇదే. అగ్గిపుల్లలను ఆధారంగా చేసుకుని మననుషుల జీవితాలు ఎలా ముడిపడి ఉంటాయో టీజర్లో చూపించారు. కొన్ని అగ్గిపుల్లను రాండమ్గా విసిరారు. అందులో ఒక్కో అగ్గిపుల్ల ఒక్కో దిశలో పడగా.. రెండు మాత్రం సమాంతరంగా పడ్డాయి. ‘కేవలం గుప్పెడు పుల్లల్లో రెండు సమాంతంగా పడినప్పుడు.. ఇన్ని వందల కోట్ల జనాల్లో ఎంతమంది జీవితాలు సమాంతరంగా ఉండొచ్చు’ అంటూ నటుడు జయప్రకాశ్ చెప్పే డైలాగ్ చాలా ఆసక్తికరంగా ఉంది.
మొత్తానికి ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్తో అల్లువారి చిన్నబ్బాయి రెడీ అవుతున్నాడు. ఈ డిసెంబర్లోనే ‘ఒక్క క్షణం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు శిరీష్ సరసన సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయప్రకాశ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపతి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణి శర్మ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్.
Presenting the teaser of Okka Kshanam. Wondering if you also might be having a "parallel life" with someone? #OkkaKshanam https://t.co/SlpFoZtPnj — Allu Sirish (@AlluSirish) December 3, 2017
టీజర్తో సినిమాపై అంచనాలు పెంచేశారు డైరెక్టర్ ఆనంద్. టీజర్ చాలా ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. లవ్ వర్సస్ డెస్టినీ.. ఇదే సినిమాలో ప్రధాన అంశం. సినిమా సబ్ టైటిల్ కూడా ఇదే. అగ్గిపుల్లలను ఆధారంగా చేసుకుని మననుషుల జీవితాలు ఎలా ముడిపడి ఉంటాయో టీజర్లో చూపించారు. కొన్ని అగ్గిపుల్లను రాండమ్గా విసిరారు. అందులో ఒక్కో అగ్గిపుల్ల ఒక్కో దిశలో పడగా.. రెండు మాత్రం సమాంతరంగా పడ్డాయి. ‘కేవలం గుప్పెడు పుల్లల్లో రెండు సమాంతంగా పడినప్పుడు.. ఇన్ని వందల కోట్ల జనాల్లో ఎంతమంది జీవితాలు సమాంతరంగా ఉండొచ్చు’ అంటూ నటుడు జయప్రకాశ్ చెప్పే డైలాగ్ చాలా ఆసక్తికరంగా ఉంది.
మొత్తానికి ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్తో అల్లువారి చిన్నబ్బాయి రెడీ అవుతున్నాడు. ఈ డిసెంబర్లోనే ‘ఒక్క క్షణం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు శిరీష్ సరసన సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయప్రకాశ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపతి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణి శర్మ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్.