యాప్నగరం

షారుఖ్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట ఒకరు మృతి చెందిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది.

TNN 24 Jan 2017, 11:37 am
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట ఒకరు మృతి చెందిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు రైల్వే పోలీసులు కూడా గాయపడ్డారు. తన తాజా సినిమా ‘రాయీస్’ ప్రమోషన్ కోసం షారుఖ్ సోమవారం సాయంత్రం ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సుమారు రాత్రి 10.30 గంటలకు రైలు వడోదర రైల్వేస్టేషన్‌‌కు చేరుకుంది. అప్పటికే షారుఖ్ కోసం వేచి చూస్తున్న అభిమానులు రైలు ప్లాట్‌ఫాం వద్దకు రాగానే ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
Samayam Telugu one dies as crowd goes berserk after shah rukh khan arrives at vadodara station
షారుఖ్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి


రైలు సుమారు 10 నిమిషాలు పాటు వడోదర స్టేషన్‌లో ఆగుతుంది. దీంతో షారుఖ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. వారిని నియంత్రించేందుకు రైల్వే పోలీసులు లాఠీ చార్జీ కూడా చేసారు. ఇంతలో రైలు బయలుదేరడంతో అభిమానులు దాని వెంట పరుగులు తీసారు. దీంతో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే వ్యక్తి మరణించాడు. ఈయన స్థానిక రాజకీయ నాయకుడుని రైల్వే పోలీసులు గుర్తించారు.

కాగా, ‘రాయీస్ బై రైల్’ పేరుతో ముంబై నుంచి ఢిల్లీ వరకు షారుఖ్ ఖాన్ సినిమా ప్రమోషన్‌ను నిర్వహించారు. షారుఖ్ స్వయంగా రైలులో ప్రయాణిస్తూ అభిమానులను కలుస్తున్నారు. షారుఖ్‌ను చూసేందుకు క్రికెట్ స్టార్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కూడా వడోదర స్టేషన్‌కు రావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.