దాదాపు పదేళ్ళ గ్యాప్ తరువాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తరువాత 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథను పట్టాలెక్కించబోతున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ భారీ స్కేల్2లో ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి
కాగా భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ మూవీకి తమన్ బాణీలు అందిస్తాడనే వార్తలు వినిపించాయి. తమన్ కూడా మొన్నామధ్య 'మై బిగ్గెస్ట్ సెన్సేషన్' అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డితో తీసుకున్న ఫోటోలను నెట్లో పెట్టాడు. వీరిద్దరు కలిసి సిట్టింగ్స్ కూడా వేశారు. దీంతో తమన్, చిరు సినిమాకు మ్యూజిక్ అందివ్వనున్నాడని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు సడెన్ గా తెరపై రెహ్మాన్ పేరు వచ్చింది. రామ్ చరణ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్తో చేయించాలని అనుకుంటున్నాడట. ఈ విషయమై ఆయనను సంప్రదించడం.. ఆయన ప్రస్తుతానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టినట్టు సమాచారం. ఒకవేళ ఆయన గనుక అంగీకరిస్తే ఇక తమన్ను పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది.
ఫ్యాన్ మేడ్ పోస్టర్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కాగా భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ మూవీకి తమన్ బాణీలు అందిస్తాడనే వార్తలు వినిపించాయి. తమన్ కూడా మొన్నామధ్య 'మై బిగ్గెస్ట్ సెన్సేషన్' అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డితో తీసుకున్న ఫోటోలను నెట్లో పెట్టాడు. వీరిద్దరు కలిసి సిట్టింగ్స్ కూడా వేశారు. దీంతో తమన్, చిరు సినిమాకు మ్యూజిక్ అందివ్వనున్నాడని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు సడెన్ గా తెరపై రెహ్మాన్ పేరు వచ్చింది. రామ్ చరణ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్తో చేయించాలని అనుకుంటున్నాడట. ఈ విషయమై ఆయనను సంప్రదించడం.. ఆయన ప్రస్తుతానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టినట్టు సమాచారం. ఒకవేళ ఆయన గనుక అంగీకరిస్తే ఇక తమన్ను పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది.
ఫ్యాన్ మేడ్ పోస్టర్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి